టీచర్లకు సువర్ణావకాశం..ప్రతిష్టాత్మక అవార్డును పొందే ఛాన్స్!

 

దేశంలోనే ప్రతిష్టాత్మక టీచింగ్ అవార్డు ఐటాప్,ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతీ ఏడాది అత్యుత్తమ ఉపాధ్యాయులకు ఐటాప్ అవార్డులను అందజేస్తున్న ప్రముఖ ఆన్‌లైన్ ట్యూటరింగ్ సంస్థ ట్యూటర్స్ ప్రైడ్, 2019 సంవత్సరానికి గానూ ఎంపిక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐటాప్ 2019 అవార్డును పొందగోరు ఉపాధ్యాయులకు కొన్ని అర్హతలను, కొన్ని లక్ష్యాలను నిర్ధేశించి దానికి అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ రూపొందించింది. భోధనా రంగంతో పాటు విభిన్న రంగాల్లో విశేషానుభవం గడించిన ప్రముఖ వ్యక్తులతో ఇప్పటికే ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపిక కమిటీ నిర్దేశించిన ప్రమాణికతల ఆధారంగా ఐటాప్ అవార్డుల మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.

 

 

మార్గదర్శకాలు

1. అవార్డును పొందగోరు ఉపాధ్యాయులు అత్యుత్తమ పనితీరు కనబర్చినవారై ఉండి భోధనా రంగంలో తమదైన ప్రత్యేకతను కలిగి ఉండాలి.
2. ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే వారి స్కూల్స్ లో డ్రాపవుట్స్ ను తగ్గించి, ఫలితాల్లో మంచి పనితీరును కనబర్చిన వారై ఉండాలి.
3. విద్యార్ధుల్లో లక్ష్యసాధన పట్ల ఆకాంక్షను రగిలించి స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలపై చైతన్యం తెచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వబడును.
4. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ, హాజరు శాతాన్ని పెంచేందుకు, డ్రాపవుట్స్ ను తగ్గించి గ్రామాల్లో విద్యా భోధనకు కృషి చేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత.
5. విద్యార్ధులకు చదువుతో పాటు క్రీడలు, సేవ, ఎన్‌సీసీ వంటి విషయాలపై ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్న వారు అవార్డు పొందడంలో ముందువరుసలో ఉంటారు.
6. స్కూళ్లలో కళలు, సాహిత్య రంగాలను ప్రోత్సాహిస్తూ విద్యార్ధులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చేసిన వారు.
7. సైన్స్ ఫెయిర్స్ ను నిర్వహిస్తూ, విద్యార్ధులు వాటిలో పాల్గోనేలా చేస్తూ విద్యార్ధులకు పరిశోధనలపై ఆసక్తి కలిగేలా కృషి చేస్తున్న వారు.
8. అలాగే విద్యార్ధులతో మొక్కలను నాటిస్తూ, హరితహారం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా విద్యార్ధులను భాగస్వాములను చేసే టీచర్స్ కు ప్రాధాన్యత ఇవ్వబడును.
9. స్కూల్ తో పాటు పనిచేసే ప్రాంతంతో అక్కడి ప్రజలతో మమేకం అవుతూ స్థానిక సమస్యలపై తమ వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా అవార్డు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
10. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రయివేట్ ఉపాధ్యాయులు కూడా ఐటాప్ అవార్డుకు దరఖాస్తు చేయొచ్చు.
11. అవార్డుకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు కనీసం 5 ఏళ్ల భోధనానుభవం ఉండాలి.
12. అలాగే భోధనతో పాటు భోధనేతర ఉపాధ్యాయులు కూడా ఐటాప్ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

 

ప్రతీ ఉపాధ్యాయునికి ఒక గర్వకారణంగా నిలిచే ఈ మెగా అవార్డుల కార్యక్రమం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఘనంగా జరగనుంది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ సమీపంలో ఉన్న కోహినూర్ ఐటీసీ హోటల్ లో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు //www.itapawards.com వెబ్‌సైట్ ను సందర్శించండి. మెయిల్ itapawards@gmail.com లేదా వాట్సప్ నెంబర్ 8978174444 లో సంప్రదించండి.