టీచర్లకు సువర్ణావకాశం..ప్రతిష్టాత్మక అవార్డును పొందే ఛాన్స్!

 

దేశంలోనే ప్రతిష్టాత్మక టీచింగ్ అవార్డు ఐటాప్,ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతీ ఏడాది అత్యుత్తమ ఉపాధ్యాయులకు ఐటాప్ అవార్డులను అందజేస్తున్న ప్రముఖ ఆన్‌లైన్ ట్యూటరింగ్ సంస్థ ట్యూటర్స్ ప్రైడ్, 2019 సంవత్సరానికి గానూ ఎంపిక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐటాప్ 2019 అవార్డును పొందగోరు ఉపాధ్యాయులకు కొన్ని అర్హతలను, కొన్ని లక్ష్యాలను నిర్ధేశించి దానికి అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ రూపొందించింది. భోధనా రంగంతో పాటు విభిన్న రంగాల్లో విశేషానుభవం గడించిన ప్రముఖ వ్యక్తులతో ఇప్పటికే ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపిక కమిటీ నిర్దేశించిన ప్రమాణికతల ఆధారంగా ఐటాప్ అవార్డుల మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.

 

 

మార్గదర్శకాలు

1. అవార్డును పొందగోరు ఉపాధ్యాయులు అత్యుత్తమ పనితీరు కనబర్చినవారై ఉండి భోధనా రంగంలో తమదైన ప్రత్యేకతను కలిగి ఉండాలి.
2. ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే వారి స్కూల్స్ లో డ్రాపవుట్స్ ను తగ్గించి, ఫలితాల్లో మంచి పనితీరును కనబర్చిన వారై ఉండాలి.
3. విద్యార్ధుల్లో లక్ష్యసాధన పట్ల ఆకాంక్షను రగిలించి స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలపై చైతన్యం తెచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వబడును.
4. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ, హాజరు శాతాన్ని పెంచేందుకు, డ్రాపవుట్స్ ను తగ్గించి గ్రామాల్లో విద్యా భోధనకు కృషి చేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత.
5. విద్యార్ధులకు చదువుతో పాటు క్రీడలు, సేవ, ఎన్‌సీసీ వంటి విషయాలపై ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్న వారు అవార్డు పొందడంలో ముందువరుసలో ఉంటారు.
6. స్కూళ్లలో కళలు, సాహిత్య రంగాలను ప్రోత్సాహిస్తూ విద్యార్ధులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చేసిన వారు.
7. సైన్స్ ఫెయిర్స్ ను నిర్వహిస్తూ, విద్యార్ధులు వాటిలో పాల్గోనేలా చేస్తూ విద్యార్ధులకు పరిశోధనలపై ఆసక్తి కలిగేలా కృషి చేస్తున్న వారు.
8. అలాగే విద్యార్ధులతో మొక్కలను నాటిస్తూ, హరితహారం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా విద్యార్ధులను భాగస్వాములను చేసే టీచర్స్ కు ప్రాధాన్యత ఇవ్వబడును.
9. స్కూల్ తో పాటు పనిచేసే ప్రాంతంతో అక్కడి ప్రజలతో మమేకం అవుతూ స్థానిక సమస్యలపై తమ వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా అవార్డు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
10. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రయివేట్ ఉపాధ్యాయులు కూడా ఐటాప్ అవార్డుకు దరఖాస్తు చేయొచ్చు.
11. అవార్డుకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు కనీసం 5 ఏళ్ల భోధనానుభవం ఉండాలి.
12. అలాగే భోధనతో పాటు భోధనేతర ఉపాధ్యాయులు కూడా ఐటాప్ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

 

ప్రతీ ఉపాధ్యాయునికి ఒక గర్వకారణంగా నిలిచే ఈ మెగా అవార్డుల కార్యక్రమం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఘనంగా జరగనుంది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ సమీపంలో ఉన్న కోహినూర్ ఐటీసీ హోటల్ లో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు //www.itapawards.com వెబ్‌సైట్ ను సందర్శించండి. మెయిల్ itapawards@gmail.com లేదా వాట్సప్ నెంబర్ 8978174444 లో సంప్రదించండి.

 

కేఫ్ కాఫీ డే సిద్ధార్థ మళ్లీ పుడితే…!!

 

నేత్రావతి నది..రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నది మంచి జోరుమీదుంది. బ్రిడ్జిపై నడుస్తున్న సిద్ధార్ధ మనస్సులో ఆలోచనలు కూడా కింద ఉన్న నదిలో నీరులాగే సుడులు తిరుగుతున్నాయి. ‘ఇంక తప్పదు ఈ ఒత్తిడిని నేను భరించలేను. నాకున్న సమస్యలన్నింటికీ ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం’. గట్టిగా ఊపిరి పీల్చుకున్న సిద్ధార్ధ నదిలోకి దూకేందుకు సిద్ధమయ్యాడు. సడెన్ గా అప్పుడే ఆగు అన్న గొంతు వినపడటంతో దూకబోతున్నవాడల్లా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసాడు. ప్రశాంత వదనంతో, మంచి తేజస్సుతో ఒక్క వ్యక్తి తనవైపే రావడాన్ని సిద్ధార్థ గమనించాడు. దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తి దేవుడు అని గుర్తించడానికి సిద్ధార్థకు ఎక్కువ సమయం పట్టలేదు. నేరుగా విషయంలోకి వచ్చిన దేవుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావ్? ఆత్మహత్య పాపం అని తెలీదా? అని అడిగాడు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సిద్ధార్థ తనకు ఎదురైన కష్టాలు, నష్టాలు, మోసాలు, బెదిరింపులు అన్నీ ఏకరువు పెట్టాడు. కొన్ని తప్పులు, మరికొన్ని పొరపాట్లు తనను ఈ స్థితికి తెచ్చాయని తనకు ఆత్మహత్య కంటే వేరే మార్గం లేదని బోరుమన్నాడు. సావధానంగా విన్న దేవుడు నువ్వు చేసిన తప్పులు, పొరపాట్లు నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి అని చెపుతున్నావ్. ‘సరే నేను నీకు ఒక వరం ఇస్తాను. నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను. ప్రస్తుత నీ సమస్యలు, నష్టాలు ఏవీ నీకు గుర్తుకు రావు. నువ్వు మరో చోట ఒక కొత్త వ్యక్తిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. హాయిగా జీవించు’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఒక కొత్త ప్రదేశంలో మళ్లీ పుట్టి ఒక కొత్త సిద్ధార్థగా తన నూతన జీవితాన్ని ప్రారంభించాడు సిద్ధార్థ. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం చేసి ఒకరి పనిచేయడం లేని సిద్ధార్థ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చిన్న స్టార్టప్ ప్రారంభించి రాత్రీ పగలు కష్టపడి దాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. వ్యాపారంలో మెల్లగా కుదురుకోగానే తన పోటీ కంపెనీల్లో కొన్నింటిని టేకోవర్ చేసి దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకడిగా ఎదిగాడు. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు బ్యాంకు రుణాలు తీసుకున్నాడు. పబ్లిక్ ఇష్యూకు వెళ్లాడు. స్టాక్ మార్కెట్లో కంపెనీని లిస్ట్ చేయించాడు. కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలన్న తొందరలో భారీగా రుణాలు తీసుకున్నాడు. ప్రభుత్వ పన్ను చట్టాలను సరిగా తెలియక కొంత, తెలిస్తే ఏమవుతుంది అన్న నిర్లక్ష్యంతో కొంత పన్ను చెల్లింపుల విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు. ఫలితంగా పలు కేసుల్లో చిక్కుకున్నాడు. ఒకవైపు భారీగా పెరిగిపోయిన రుణాలు, మరోవైపు కేసులు, ఇంకోవైపు దేశంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ గా ఉండి ఇప్పుడు నలుగురిలో తలెత్తుకు తిరగ్గలనా అన్న భయాలు వెరిసి ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనే నిర్ణయానికొచ్చాడు. మళ్లీ అదే నేత్రావతి నది దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. మళ్లీ వచ్చిన అతని ప్రయత్నాన్ని ఆపిన దేవుడు తను గతంలో ఎవరు? ఇప్పుడు ఎవరు? తను ఏం చేసింది అంతా వివరంగా చెప్పుకొచ్చాడు. చూడు సిద్ధార్థ..ప్రతీ మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు. చేయాలి కూడా. ఎందుకంటే తప్పు చేసిన ప్రతీసారీ కింద పడిన ప్రతీసారీ మనం పైకి లేచి ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. మరోసారి అటువంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. జీవితం అంతా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవడమే జీవితం. నీలా ఆత్మహత్య చేసుకుంటే నేను సృష్టించిన ఈ జగత్తులో ఒక్క ప్రాణి కూడా మనుగడ సాగించి ఉండేది కాదు. తప్పులు చేసి ఎంతగా నష్టపోయినా, ఎంత కిందకు చేరుకున్నా ధైర్యంతో ముందుకు సాగితే జీవితం మనకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. మనిషి సృష్టించుకున్న ఈ డబ్బు కన్నా, ఈ వ్యాపార సామ్రాజ్యాల కన్నా ప్రాణం విలువైనది. అది లేకపోతే ఈ ప్రయాణం ఎందుకు? ఈ డబ్బు ఎందుకు? విజయం అనేది మన ఆనందం, సంతృప్తిలో ఉంటుంది కానీ డబ్బులు, వ్యాపార సామ్రాజ్యాలలో ఉండదు.

 

 

ఓపిక, సహనంతో వేచి ఉండాలి!

మనిషి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఓపికతో వేచి చూడటం. విత్తనం మొక్కలా మారి ఎదిగి మనకు ఫలసాయం అందించాలన్నా, తల్లి కడుపులో ఒక చిన్నారి మనిషిగా రూపుదాల్చాలన్నా కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ ఉత్సాహంతో వేచి ఉండాలి. అలా అని ఒక పనిని ఏదో తూతూమంత్రంగా చేసి మంచి ఫలితాల కోసం వేచిచూడమని కాదు. చేయాల్సిన పనిని నాణ్యంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా కష్టపడి చేసి దాని ఫలితాల కోసం ఎదురు చూడాలి. కుటుంబంతో అన్ని విషయాలను పంచుకుంటూ వచ్చే ఫలితం కోసం అధికంగా ఆలోచిండచం మాని ఎటువంటి ఫలితం వచ్చినా తీసుకునేందుకు సిద్దంగా ఉండాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఒత్తిడిని జయించగలడు. అలా కాకుండా ఒక పని చేసి దాని ఫలితం కోసం ఎదురు చూడటం, ఏం జరగవచ్చని తీవ్రంగా ఆలోచించడం వంటివి చేస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. ఒత్తిడి పెరిగి చివరికి ఆత్మహత్యలకు దారితీస్తాయి. మనిషి కర్తవ్యం ముగిసిన వెంటనే ఫలితాన్ని పరమాత్మ అస్థిత్వానికి విడిచిపెట్టేయాలి. అంటే మూఢంగా దేవుడ్ని నమ్మమని కాదు. తాజాగా చంద్రయాన్ 2 ప్రయోగంలో రాకెట్ ను శక్తివంచన లేకుండా కష్టపడి తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రయోగం ముందు రోజు దేవుని వద్దకు వెళ్లి మోకరిల్లారు. ఎందుకు వారు చేయాల్సిన పనిని 100 శాతం కచ్చితత్వంతో, నైపుణ్యంతో చేసారు. ఫలితం బాగుండాలని దేవుడ్ని శరణు వేడుకున్నారు. దీని వలన ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

 

 

ధైర్యమే జీవితం!

మనం ముందు చెప్పుకున్న దేవుడు, సిద్ధార్థ కథలానే ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఎన్నో అపజయాలు , కష్టాలు, నష్టాలు ఉంటాయి. వాటన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారం కాదు. ఈ కథలోని సారాన్ని ఈ తరం విద్యార్ధులు, ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. సరిగ్గా మార్కులు రాలేదనో, పక్కవాడి కంటే తక్కువ జీతం వచ్చిందనో, ఉద్యోగం పోయిందనో ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య అనేది ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు. చక్కగా జీవితాన్ని సంపూర్ణంగా గడిపేందుకు దేవుడు మనకు ఈ శరీరాన్ని ఇంత విశాలమైన ప్రపంచాన్ని, ప్రకృతిని ఇచ్చాడు. కింద పడిన ప్రతీసారి లేచే చంటి పిల్లాడిలా ఎప్పటికప్పుడు లేచి కొత్తగా జీవితం అనే పరుగును మొదలుపెట్టాలి. సిద్ధార్థ లాంటి ప్రతిభావంతులకు ఆస్తులన్నీ పోయి కేఫ్ కాఫీ డే వంటి సంస్థలు పోతే ఏమైనా అవుతుందా? మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టి తన సామర్ధ్యంతో మరింతగా ఉన్నతంగా ఎదగగలరు. కానీ అప్పటి వరకూ విజేతగా ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకుని పరాజితునిగా నిలిచిపోయారు. కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి తలెత్తుకు తిరిగే వారినే దేవుడు, ఈ ప్రకృతి ప్రేమతో అక్కున చేర్చుకుంటాయి. భయపడేవాళ్లకు, బెదిరిపోయే వాళ్లకు, తప్పులు చేసేందుకు తటపటాయించే వారికి ఇక్కడ స్థానం లేదు. విద్యార్ధులూ గుర్తు పెట్టుకోండి. ధైర్యమే జీవితం.

డా. ఆర్‌.బీ. అంకం

 

 

ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లందుకుంటున్న‌ ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’

 

ప్రముఖ విద్యావేత్త‌, ట్యూట‌ర్స్ ప్రైడ్ అధినేత‌ డా. ఆర్.బి. అంకం గారు రాసిన ‘పిల్లల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కం ఇప్పుడు మార్కెట్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ ఆధునిక యుగంలో అతిపెద్ద స‌వాలుగా మారిన పిల్ల‌ల పెంప‌కంపై డా. అంకం గారు చెప్పిన ప‌రిశోధ‌నాత్మ‌క అంశాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముక్కుసూటిగా చెప్పిన విష‌యాలు ప్రతీ త‌ల్లిదండ్రుల గుండెను తాకుతున్నాయి. సాంకేతిక విప్ల‌వం తెచ్చిన అభివృద్ధి మాన‌వాళి జీవితాల‌ను ఎంత‌గా స‌ర‌ళ‌త‌రం చేసిందో తెలీదు కానీ పిల్ల‌ల పెంప‌కాన్ని మాత్రం అతిపెద్ద స‌వాలుగా మార్చింది. ఇంట‌ర్నెట్ లో పిల్ల‌లు ఏం చూస్తున్నారో, సోష‌ల్ మీడియా ద్వారా ఏం నేర్చుకుంటున్నారో తెలియ‌క తల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లుతున్నారు. మ‌రోవైపు ఉమ్మడి కుటుంబాలు క‌నుమ‌రుగైన దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితుల్లో పిల్ల‌ల‌కు మ‌న సంస్కృతీ, సాంప్ర‌దాయాలు, విలువ‌లు నేర్పించే పెద్ద‌లు క‌రువైపోయారు. దీంతో ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌ గౌర‌వ మ‌ర్యాద‌లు తెలీక ప్ర‌తీ చిన్న విష‌యానికీ టెక్నాల‌జీపై ఆధార‌ప‌డుతున్న నేటి త‌రాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ పుస్త‌కంలో డా.ఆర్.బి. అంకం గారు స‌వివ‌రంగా పొందుప‌ర్చారు.

 

పుస్త‌కంలోని ప్ర‌తీ అక్ష‌రం త‌ల్లిదండ్రుల‌కు, పిల్ల‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే అద్భుత‌మైన విష‌యం కావ‌డంతో విడుద‌లైన త‌క్కువ స‌మ‌యంలోనే అశేష పాఠ‌కాద‌ర‌ణ పొందింది. ఈ పుస్త‌కంలో శాస్త్రీయంగా, విపులంగా చ‌ర్చించిన విష‌యాలు న‌చ్చి మాజీ ఐపీఎస్ అధికారి జే.డీ. ల‌క్ష్మీనారాయ‌ణ గారు అలాగే భార‌తీయ సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న భార‌తీయం స‌త్య‌వాణి గారు ముందుమాట‌ను రాసారు. పుస్త‌కంలోని అద్భుత విష‌యం పాఠ‌కులంద‌రికీ చేరాల‌న్న ఉద్దేశంలో ప్ర‌ముఖ ప‌బ్లిషింగ్ సంస్థ ఎమెస్కో ఈ పుస్త‌కాన్ని ప్ర‌చురించింది. అలాగే తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది.

 

 

జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న ప్ర‌ముఖ ర‌చయిత‌లు, సాహితీవేత్త‌లు, సాహిత్యాభిమానులు ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌శంసించారు. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కూడా ఈ పుస్త‌కాన్ని , ర‌చ‌యిత డా. ఆర్.బి.అంకం గారిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

 

ఆ ‘డేంజ‌ర్ జోన్’ లోకి వెళ్తే ఇక అంతే సంగ‌తులు!!

 

ఈ లోకంలో ప్ర‌తీ మ‌నిషి సౌక‌ర్య‌వంత‌మైన‌, భ‌ద్ర‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని కోరుకుంటాడు. అయితే సౌక‌ర్య‌వంత‌మైన‌, భ‌ద్ర‌మైన జీవితం అత‌న్ని ఉన్న‌త స్థితికి చేరుస్తుందా అంటే లేదు అనే స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది. ఎందుకంటే మ‌నిషి ప్ర‌తీ క్ష‌ణం మ‌నుగ‌డ కోసం, అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సిందే. ఒక స్థితికి చేరుకుని విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా..సౌక‌ర్యాల‌కు లొంగిపోయి అక్క‌డే ఉండిపోదాం అనుకున్నా అది అత‌ని వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త‌ ప‌త‌నానికి దారితీస్తుంది. కంఫ‌ర్ట్ జోన్ లోని విలాసాల‌కు, స‌దుపాయాల‌కు ఆక‌ర్షితులు కాకుండా ప్ర‌తీ క్ష‌ణాన్ని పోరాటంలా ఎవ‌రైతే తీసుకుంటారో, స‌వాళ్ల‌కు ఎవ‌రైతే సిద్ధ‌ప‌డ‌తారో వారే నిజ‌మైన విజేత‌లుగా నిలుస్తారు. ప్ర‌స్తుతం యువత‌ను నిర్వీర్యం చేస్తున్న కంఫ‌ర్ట్ జోన్ పై ‘కెరీర్ టైమ్స్ ఆన్ లైన్’ ప్ర‌త్యేక విశ్లేష‌ణ‌.

 

 

కంఫ‌ర్ట్ జోన్ లో ఉంటే డేంజ‌ర్ జోన్ లో ఉన్న‌ట్టే!

 

చాలా మంది వ్య‌క్తులు చిన్న సౌక‌ర్యాల‌కు మ‌రిగి ఒకే స్థాయిలో ఉండిపోయేందుకు సిద్ధ‌ప‌డుతూ ఉంటారు. ఆ కంఫ‌ర్ట్ జోన్ లోంచి బ‌య‌ట‌కు రావ‌డానికి అస‌లు క‌నీస‌మైన ప్ర‌య‌త్నం కూడా చేయ‌రు. అందులోంచి బ‌య‌ట‌కు వ‌స్తే క‌ష్టాలు చుట్టుముడ‌తాయ‌ని, ఇక్క‌డ ప్ర‌స్తుతానికి బాగానే ఉంది క‌దా అన్న ధోర‌ణిలోకి వెళ్లిపోతారు. చివ‌రికి వాళ్లు ఏదైతే డేంజర్ జోన్ అనుకుంటున్నారో అదే డేంజ‌ర్ జోన్ లో చిక్కుకుని జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకుంటారు. రాము, రాజు ఇద్ద‌రే ఒకే సంస్థ‌లో ఉద్యోగం చేసేవారు. రాముకు రిస్క్ తీసుకోవ‌డం అస్స‌లు ఇష్టం ఉండ‌దు. రాజు అలా కాదు. ఎంత పెద్ద రిస్క్ తీసుకునేందుకు అయినా వెనుకాడ‌డు. అద్దె త‌క్కువ ఉంది అని రాము చాలా దూరం నుంచి ఆఫీస్ కు వ‌చ్చేవాడు. పైగా జీతం త‌క్కువైనా పెద్ద‌గా ప‌ని ఉండ‌ద‌ని అదే ఉద్యోగంలో కొన‌సాగాడు. రాజు మాత్రం అద్దె ఎక్కువైనా ఆఫీస్ తో పాటు అన్ని అవ‌కాశాలు ద‌గ్గ‌రగా ఉన్న మంచి లోకేష‌న్ లో ఉండేవాడు. కొన్ని రోజుల త‌ర్వాత జీతం అంతగా వృద్ధి చెంద‌ని ఆ ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప‌దేళ్లు తిరిగేస‌రికి పెద్ద వ్యాపారవేత్త‌గా ఎదిగాడు.

 

 

ఒకే ద‌గ్గ‌ర ఉండిపోయారంటే ఓడిపోయిన‌ట్టే!

 

రాము, రాజు క‌థ చ‌దివాక మ‌న‌కు తెల‌సింది ఏమిటి? నెల‌కు ఇంత జీతం వ‌స్తుంది. చ‌క్క‌గా ఉంది. అని స్వీయ స‌మ‌ర్ధింపులు చేసుకుంటూ ఒకే ద‌గ్గ‌ర ఉండిపోయే వాళ్లు ఎప్ప‌టికీ జీవితంలో అభివృద్ధిని సాధించ‌లేరు. ఒకే స్థాయిలో ఉండిపోయి చివ‌రికి ఏమీ సాధించ‌కుండానే మిగిలిపోతారు. కానీ రిస్క్ తీసుకుని ధైర్యంతో ముందడుగు వేసే వ్య‌క్తులు ఉన్న‌త స్థితికి చేరుకుంటారు. మొద‌ట్లో త‌మ‌ను ఎవ‌రైతే చూసి హేళ‌న చేసారో, విమ‌ర్శించారో వాళ్లంద‌రినీ దాటుకుని అభివృద్ధిని సాధిస్తారు. బాగా తిని కొమ్మ‌పై చ‌క్క‌గా ఎప్పుడూ కూర్చుని ఉంటే చిలుక కూడా ఎగ‌ర‌లేదు. అలాగే మ‌నిషి నైజం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం, సుఖానికి , సౌక‌ర్యానికి శ‌రీరాన్ని, మ‌న‌స్సును అల‌వాటు చేస్తే అవి ఎప్ప‌టికీ మీ మాట విన‌వు. చివ‌రికి చిలుక‌లా చ‌లాకీగా ఎగిరే స‌హ‌జ గుణాన్ని కోల్పోతారు. ఏం చేసినా ఎక్క‌డ ఉన్నా ప్ర‌తీ క్ష‌ణం ఏదో సాధించాల‌న్న త‌ప‌నను విడ‌నాడ‌కూడ‌దు. థింక్ బిగ్ అన్న సూత్రాన్ని అటు విద్యార్ధులు, ఇటు ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా అనుక్ష‌ణం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నచోట, ఉన్న స్థితితో ఎప్పుడూ రాజీ ప‌డ‌కూడ‌దు. ఏదో జీవితం బాగానే గ‌డుస్తుంది క‌దా అన్న ఆలోచ‌న మీలో సృజ‌నాత్మ‌క‌త‌ను చంపేసి మీ గొప్ప‌త‌నానికి స‌మాధిగా మారుతుంది. పెద్ద‌గా ఆలోచించాలి. అభివృద్ధి చెందడానికి ఆలోచించాలి. ఆ ఆలోచ‌న‌ను ఆచ‌ర‌ణ‌గా మార్చాలి. ఉన్న‌తంగా ఎద‌గాలి.

 

 

సేఫ్టీ జోన్ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలి?

 

        మనిషి ప‌రిణామ క్ర‌మంలోనే సవాళ్ల‌ను ఎదుర్కొనే శ‌క్తి ఉంది. యితే అభివృద్ధిలో భాగంగా చిన్న చిన్న ల‌క్ష్యాల‌నే గొప్పవిగా ఊహించుకుంటూ, ఉన్న స్థితిని అల‌వాటుగా మార్చుకుంటూ స్వీయ త‌ప్పిదాల‌కు పాల్ప‌డుతున్నాం. ఒక విధంగా కంఫ‌ర్ట్ జోన్ లో ఉండ‌టం అంటే మ‌న జీవితం ముగిసిన‌ట్టే. కొత్త స‌వాళ్లు, కొత్త వ్యూహాలు, కొత్త ఆలోచ‌న‌లు ఇవేమీ లేకుండా నిస్సార‌మైన జీవితాన్ని బాగుంది, భ‌లే ఉంది అన్న భ్ర‌మ‌ల్లో చాలా మంది ఉండిపోతున్నారు. కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోకుండా దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మ‌న‌కు మ‌న‌మే కొన్ని స్వీయ ప‌రీక్ష‌లు పెట్టుకోవాలి. కొంచెం క‌ఠినంగా, ఇంకొంచెం విచిత్రంగా, నిజంగా ఇలా కూడా చేయొచ్చా అనిపించినా ఈ కింద మ‌నం చెప్పుకుంటున్న ప‌నులు చేస్తే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

1. జేబులో ఉన్న చివ‌రి రూపాయి కూడా ఖ‌ర్చు పెట్టేయ్ ( మ‌ళ్లీ డ‌బ్బు సంపాదించుకోగ‌ల‌ను అన్న న‌మ్మ‌కం మిమ్మ‌ల్ని న‌డిపిస్తుంది)

 

2. అవ‌స‌రం ఏర్ప‌డిన‌ప్పుడు అప్పులు చేసేందుకు వెనుకాడొద్దు. నీకు అప్పు దొర‌క‌ని ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు నువ్వు మ‌రింత‌గా రాటుదేలుతావు.

 

3. ఒక ప‌నిని చివ‌రి నిమిషం వ‌ర‌కూ వాయిదా వేసి చివ‌రి నిమిషంలో నీ స‌ర్వశ‌క్తులూ ఒడ్డి పూర్తిచేయ్

 

4. ట్రైన్, బస్, ఫ్లయిట్, సినిమా ఇలాంటి టిక్కెట్స్ ముందుగా కాకుండా అప్ప‌టిక‌ప్పుడు దొర‌క‌పుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

 

5. ఒక ఉద్యోగంలో ఉంటూ వేరే ఉద్యోగంలోకి మారాల‌నుకున్న‌ప్పుడు వెంట‌నే ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పుడు కొత్త ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టండి.

 

6. జేబులో చివ‌రి రూపాయి వ‌ర‌కూ ఖ‌ర్చ‌పెట్టేయ్. ఆ రోజు అవ‌స‌రాల‌కు ఎలా సంపాదించుకోవాల‌న్న విష‌యాన్ని సీరియ‌స్ గా ఆలోచించి అందులో విజ‌యం సాధించు.

 

 

        ఇవ‌న్నీ కంఫ‌ర్ట్ జోన్ నుంచి మిమ్మ‌ల్ని బ‌య‌ట‌ప‌డేసి మీ మెద‌డు చురుగ్గా ప‌నిచేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీవితం యొక్క ప‌ర‌మార్ధం, డ‌బ్బు విలువ తెలిసేలా చేస్తాయి. ఇవి కొన్ని రోజులు మాత్ర‌మే చేయ‌వ‌ల‌సిన ప‌నులు. కంఫ‌ర్ట్ జోన్ లోని ప్ర‌మాదాన్ని అర్ధం చేసుకున్నాక మీరు ఇలాంటి ప‌నులు చేయ‌కుండా మీ విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకుంటూ ఉన్న స్థాయి నుంచి ఉన్న‌త స్థాయికి చేరుకునేందుకు మీర‌నుకున్న డేంజ‌ర్ జోన్ మీకు కంఫ‌ర్ట్ జోన్ గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంక చాలు… నాకు ఇక్క‌డ బాగుంది.. అన్న ఆలోచ‌నల‌ను మీ మెద‌డులోకి అస్స‌లు రానీయ‌కుండా చూసుకొండి. ఇంక చాలు అన్న‌ది మ‌న చురుకుద‌నాన్ని, ఉత్సాహాన్ని చంపేసి మ‌న‌ల్ని ప‌త‌నం దిశ‌గా తీసుకువెళుతుంది.

 

ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్సాన్స‌ర్ చేస్తున్న‌వారు

 

విన‌య విధేయ రామ..ఇప్పుడే ఎందుకు?

 

 

మాతృస్వామ్య వ్య‌వ‌స్థ నుంచి నేటి పితృస్వామ్య వ్య‌వ‌స్థ వ‌ర‌కూ ఆడ‌, మ‌గ మ‌ధ్య విభిన్న కార‌ణాల రీత్యా సంఘ‌ర్ష‌ణ జ‌రుగుతూనే ఉంది. ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నాలు, అణిచివేత‌పై తిరుగుబాట్లు, ఆచారాల సంకెళ్ల‌ను తెంపుకునే ఆరాటాలు, స్వీయ గుర్తింపు కోసం పాకులాట‌లు ఒక‌వైపు.. స్వ‌యంప్ర‌తిప‌త్తి విచ్చ‌ల‌విడిత‌నం అనే క‌ట్టుబాట్లు, బాధ్య‌త‌ల చ‌ట్రంలో ఇరికించే ప్ర‌య‌త్నాలు, సొంత ఆస్తిలా భావించే ఆలోచ‌న‌లు మ‌రోవైపు. అయినా ఎన్ని విభేధాలున్నా ప‌ర‌స్ప‌ర ఆక‌ర్ష‌ణ‌, ప్రాకృతిక ఆదేశాలు, సృష్టి ధ‌ర్మం ఆడ‌, మ‌గ‌ను ఎప్పుడూ క‌లిపే ఉంచుతాయి. శారీర‌క ధ‌ర్మాల విష‌యంలో వ్య‌త్యాసాలు, శ‌క్తి సామ‌ర్ధ్యాల విష‌యంలో హెచ్చుత‌గ్గుల నేప‌థ్యంలో బాధ్య‌త‌ల‌ను, బంధాల‌ను విభ‌జించుకుని కొన్ని నియ‌మాలు ఆధారంగా ప‌ర‌స్ప‌ర జీవ‌నం సాగిస్తున్నారు. అయితే గ‌డిచిన కొన్నాళ్లుగా మ‌హిళ‌లు ఆ నియ‌మాల‌ను, ఆంక్ష‌ల‌ను, అణిచివేత‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఏ విష‌యంలోనూ తాము పురుషుల‌కు తీసిపోమ‌ని చెపుతూ లింగ స‌మాన‌త్వం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు పురుషులు చేసేవి అకృత్యాలు, అన్యాయాలు అంటూ గ‌ళం విప్పుతున్నారు. అయితే చేసే పోరాటంలో నిబ‌ద్ధ‌త కొర‌వ‌డ‌టం, స్వార్ధ ప్ర‌యోజ‌నాలు, ద్వేషం త‌ప్ప ద్యేయం లేక‌పోవ‌డం ఇప్పుడు మ‌హిళా పోరాటాల‌కు విలువ లేకుండా చేస్తున్నాయి.

 

 

‘మీటూ’ అటు తిరిగి ఇటు తిరిగి ఎటో వెళ్లిపోయింది !

 

తాజాగా మ‌న దేశంలో మీటూ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సింది. ప్ర‌స్తుతం ఉన్న‌త స్థానాల్లో ఉన్న చాలా మంది మ‌హిళ‌లు ఒక‌ప్పుడు తామ లైంగిక వేధింపులను గురి అయ్యామంటూ గ‌ళ‌మెత్తారు. ముఖ్యంగా న‌టీమణులు, జ‌ర్న‌లిస్ట్ లు తాము లైంగిక దాడికి గుర‌య్యామ‌ని వివ‌రించారు. అప్ప‌ట్లో కెరీర్ ముఖ్యం కాబ‌ట్టి నోరు విప్ప‌లేక‌పోయామ‌ని, ఇప్పుడు సంద‌ర్భం వ‌చ్చింది కాబ‌ట్టి బ‌హిరంగం చేస్తున్నామ‌ని చెప్పారు. కానీ ఈ ఉద్య‌మంలో నిజాయితీ కంటే స్వార్ధ ప్ర‌యోజ‌నాలు, క‌క్ష్య పూరిత చ‌ర్య‌లు అధికం కావ‌డంతో మీటూ ఉద్య‌మం ఎంత వేగంగా ఎగిసిందో అంతే వేగంగా చ‌ల్ల‌బ‌డిపోయింది. చాలా మంది మ‌హిళ‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌కు సాటి మ‌హిళ‌లే మ‌ద్ధ‌తు ఇవ్వ‌ని ప‌రిస్థితులు ఉన్నాయి. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక పురుషునితో మంచిగా ఉండి, ఇష్ట‌పూర్వ‌కంగా అన్ని విష‌యాల్లో వ్య‌వ‌హ‌రించి ఇప్పుడు అవ‌న్నీ బ‌ల‌వంతంగా చేసిన‌వ‌ని చెప్ప‌డం స‌త్యదూరంగా ఉండ‌టం మీటూ ఉద్య‌మాన్ని చుల‌క‌న చేసింది. ఆరోప‌ణ‌లు చేసిన వెంట‌నే ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయ‌లేదు అన్న ప్ర‌శ్న త‌క్షణం ఎదుర‌వుతోంది. అప్పుడు నిస్స‌హాయిరాలిని, ప‌రిస్థితులుకు కొత్త‌, అంత ధైర్యం లేదు అన్న స‌మాధానాల్లో కొన్ని నిజాలే అయిన‌ప్ప‌టికీ గ‌డిచిన‌ కాలంతో పాటు ఆ నిజాల‌కు కూడా విలువ లేకుండా పోతోంది.

 

 

మ‌న పురాణాల్లోనూ ‘మీటూ’ ఉంది!

 

లైంగిక అవ‌స‌రాలు స్త్రీ, పురుషులు ఇద్ద‌రికీ స‌మాన‌మే అయిన‌ప్ప‌టికీ పురుషుడు బ‌ల‌వంతుడు కాబ‌ట్టి కొన్నిసార్లు స్త్రీ ఇష్టానికి వ్య‌తిరేకంగా అత్యాచారం చేసే వీలుంది. దీని వ‌ల‌న స‌హ‌జంగానే మ‌హిళ‌ల‌పై కాస్త సానుభూతి, చ‌ట్ట‌ప‌రంగా అనుకూల‌త‌లు ఉంటాయి. ఎందుకంటే బ‌ల‌హీనుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం మ‌న నాగ‌రిక జీవనంలో పెట్టుకున్న మొద‌టి నియ‌మం. అయితే ప‌ర‌స్ప‌ర ఇష్టపూర్వ‌కంగా కొన‌సాగించే సంబంధాల‌ను అవి బెడిసికొట్టాక‌ బ‌ల‌వంత‌పు చ‌ర్య‌గా స్వార్ధ‌పూరితంగా ఆరోపించ‌డమే ఇప్పుడు స‌మ‌స్య‌. మ‌న పురాణాల్లో చూసుకుంటే నిష్ఠ‌గా త‌ప‌స్సు చేసే రుషి పుంగ‌వుల ద‌గ్గ‌ర‌కు ఇంద్రుడు రంభ‌, ఊర్వ‌శి, మేన‌క వంటి అంద‌గ‌త్తెల‌ను పంప‌డం త‌ర్వాత వాళ్ల‌తో ఆరోప‌ణ‌లు చేయించ‌డం, వాళ్ల విశ్వ‌స‌నీయ‌త‌ను, వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీయడం ఇలాంటివి జ‌రిగేవి. అయితే ఇద్ద‌రు స్త్రీ , పురుషులు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అంగీకారంతో జ‌రిగిన ఒక విష‌యాన్ని కేవ‌లం ఒకే వ్య‌క్తి త‌ప్పుగా చిత్రీక‌రించి కేవ‌లం పురుషుల ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీయడం అప్ప‌టి నుంచే జ‌రుగుతోంది. ఒకవైపు స్త్రీ పురుష స‌మాన‌త్వం కోసం మాట్లాడుతూ ఏం చేసినా కేవ‌లం ఒక్క వ్య‌క్తిదే త‌ప్పు అన్న‌ట్టు చిత్రీక‌రించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌ప్పుడు స‌మాన‌త్వం ఎలా సాధ్య‌మ‌వుతుంది? నిజంగా త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు లేదా అత్యాచారం జ‌రిగిన‌ప్పుడు క‌చ్చితంగా శిక్ష ప‌డాల్సిందే. కానీ అవ‌స‌రాల కోసం స‌ఖ్యంగా ఉండి ఇద్ద‌రి మ‌ధ్య విభేధాలు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే అది అన్యాయం అంటూ గొంతు చించుకోవ‌డం ఎటువంటి లింగ స‌మాన‌త్వ‌మో, ఎటువంటి నిబ‌ద్ధ‌త ఉన్న పోరాట‌మో కొంద‌రు స్త్రీలు ఆలోచిస్తే బాగుంటుంది. మ‌రోవైపు మీటూ ఉద్య‌మం ద్వారా లాభ‌ప‌డిన మ‌హిళ‌ల సంగతి ఏమో కానీ న‌ష్ట‌పోయిన, పోతున్న మ‌హిళ‌లే ఇప్పుడు ఎక్కువ‌గా క‌న‌నిస్తున్నారు. ఈ ఉద్య‌మం నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు, వారికి ఉన్న‌త స్థానం క‌ల్పించేందుకు బ‌డా కంపెనీలు సైతం భ‌య‌ప‌డుతున్నాయి. ఎందుకు వ‌చ్చిన చిక్కు అనుకుంటున్నాయి. బ‌య‌ట‌కి అటువంటిదేమీ లేదని చెపుతున్నప్ప‌టికీ వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం ఇలానే ఉంద‌ని చాలా మంది మ‌హిళ‌లు వాపోతున్నారు. మ‌రోవైపు మీటూతో వేధింపులు ఆగాయోమో కానీ సాధింపులు మాత్రం పెరిగాయి. చేసిన ప‌నినే మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌డం, ప‌నిచేస్తున్నా ఇంకా ప‌ని అప్ప‌గించ‌డం వంటి వేధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారు పెరిగారు. దీంతో కెరీర్ ను ఎలా కొన‌సాగించాలా అని చాలా మంది మ‌హిళ‌లు మ‌ధ‌న ప‌డుతున్నారు.

 

 

అడ్డుగోడ‌లు క‌ట్టేస్తూ, ద్వేషిస్తూ స‌మాన‌త్వం ఎలా సాధిస్తారు?

 

ఇప్పుడు మ‌నం ప్ర‌భుత్వ బ‌స్సుల్లో చూస్తే స్త్రీల సీట్ల‌కు పురుషుల సీట్ల‌కు మ‌ధ్య ఒక అడ్డు గోడ లాంటి ప్ర‌త్యేక ఏర్పాటును చేసారు. అలాగే చాలా స్కూళ్ల‌లో, కాలేజీల్లో స్త్రీ, పురుషుల‌కు వేరు వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్త్రీ, పురుష స‌మాన‌త్వం సాధిస్తాం అని చెపుతున్న ప్ర‌భుత్వాలు ఇలా చిన్నత‌నం నుంచే వాళ్ల మ‌ధ్య విభ‌జ‌న రేఖ గీస్తూ మాన‌సికంగా దూరం పెంచుతున్నారు. అబ్బాయిలు అంటే మంచి వాళ్లు కాదు అన్న అభిప్రాయం ఏర్ప‌రుచుకున్న ఆడ‌పిల్ల‌లు రేపు వాళ్ల‌తో స‌ఖ్యంగా ఎలా ఉండ‌గ‌ల‌రు. ఒక మ‌గ‌పిల్ల‌వాడికి ఆడ‌పిల్ల‌ను గౌర‌వించ‌డం, జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం నేర్పించ‌డం ఎంత ముఖ్య‌మో..అలాగే ఒక ఆడ‌పిల్ల‌కు కూడా మ‌గ‌పిల్ల‌ల‌ను గౌర‌వించ‌డం నేర్పించాలి. ఎందుకంటే ఆమె జీవితంలో ప్రతీ మ‌లుపులోనూ మ‌గ‌వాడు ఉంటాడు. తండ్రి, అన్న‌య్య‌, త‌మ్ముడు, స్నేహితుడు, భ‌ర్త ఇలా ఆమె జీవితాంతం మ‌గ‌వాళ్ల‌తోనే బ‌త‌కాలి. అటువంట‌ప్పుడు మ‌గ‌వాళ్ల‌ను ద్వేషించే ప‌రిస్థితులు క‌ల్పిస్తే ఎంతసేపు గొడ‌వ పెట్టుకునే మ‌నస్త‌త్వంలోనే కూరుకుపోతారు. ఇక‌ సామ‌ర‌స్యంగా ఉండి జీవితాన్నిఎలా ఆనంద‌మ‌యం చేసుకుంటారు? ఎవ‌రో ఒక‌రు త‌ప్పు చేసార‌ని మొత్తం అంద‌ర్నీ అనుమానంగా చూడ‌టం, అగౌర‌వంగా ఉండ‌టం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు? మ‌ంచికి చెడుకి ఎప్పుడూ లింగ‌భేధం ఉండ‌దు. మ‌గ‌వాళ్ల‌లో చెడ్డ‌వాళ్లు ఉన్న‌ట్టే ఆడ‌వాళ్ల‌లోనూ చెడ్డ‌వాళ్లు ఉంటారు. అంద‌ర్నీ ఒకే గాటిన క‌ట్ట‌డమే స‌మ‌స్య‌కు మూల కార‌ణం.

 

 

విన‌య విధేయ రాముళ్లు ఎక్కువయ్యారు!

 

మీటూ ఉద్య‌మం ఎప్పుడూ ప్రారంభ‌మైందో అప్పుడే మ‌గ‌వాళ్ల‌లో భ‌యం ప్రారంభ‌మైంది. ఏ క్ష‌ణాన ఏ ఆరోప‌ణను ఎదుర్కోవాల్సి వ‌స్తుందోన‌ని చాలా మంది భ‌య‌ప‌డ్డారు. ఆడ‌వాళ్ల‌తో ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారు మ‌న‌కెందుకు వ‌చ్చిన గొడ‌వ అనుకుంటూ దూరంగా జ‌రిగి విన‌య విధేయ రామ త‌ర‌హాగా మారిపోయారు. గ‌తంలో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో సంబంధాల‌ను కొనసాగించిన వారు, ఇప్పుడు స‌మాజంలో మంచి స్థానంలో ఉన్న‌వారు ఆందోళ‌న చెందారు. ఒక మ‌హిళ‌కు నిజంగా అన్యాయం చేసినవారు శిక్ష అనుభ‌వించాల్సిందే. ఇందులో రెండో మాట‌కు తావు లేదు. కానీ ఒక అంగీకారంతో ఒక సంబంధాన్ని కొన‌సాగించిన‌ప్పుడు అందులో ఏమోష‌న్స్ ఉండ‌వు. ఎందుకంటే ఒప్పందం అంటే వ్యాపారం , వ్యాపారంలో లాభ‌న‌ష్టాలే ఉంటాయి కానీ ఎమోష‌న్స్ ఉండ‌వు. అది ఆడ అయినా మ‌గ అయినా ప్ర‌తీ ఒక్క‌రికి త‌మ హ‌ద్దులు తెలియాల్సిందే. ఎవ‌రి హ‌ద్దులో వాళ్లు ఉన్న‌ప్పుడు ఎటువంటి స‌మ‌స్య‌లు రావు. ఒక‌రి హ‌ద్దుల గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టుకుని ఎవ‌రూ మీ కోట‌లోకి రాలేరు. అలా వ‌చ్చారంటే అది మీరు ఇచ్చిన అనుమతి మాత్ర‌మే. నైతిక విలువ‌లు నేర్చుకుని ప్ర‌తీ మ‌నిషినీ గౌర‌విస్తూ ఎవ‌రి హ‌ద్దులో వాళ్లు ఉంటే ఎవ‌రికీ ఎటువంటి స‌మ‌స్య‌లూ రావు. ఇలా గొంతుచించుకునే మీటూ ఉద్య‌మాలు కూడా అవ‌స‌రం లేదు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)

 

‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ప్ర‌తీ పేరెంట్ చ‌ద‌వాలి – భార‌తీయం స‌త్య‌వాణి

 

 

ఈ టెక్నాల‌జీ యుగంలో అతి క‌ష్ట‌మైన ప‌నుల్లో ఒక‌టి పేరెంటింగ్. పిల్ల‌ల‌ను బాగా పెంచి , మంచి పౌరులుగా, బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తులుగా తీర్చిదిద్ద‌డం సవాలుతో కూడుకున్న ప‌ని. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఉద్యోగాలు చేయ‌డం, సాంకేతికత విస్తృతంగా పెరిగిపోవ‌డంతో పిల్లల‌ను అదుపులో పెట్ట‌డం అనేది క‌ష్ట‌సాధ్యంగా మారుతోంది. ఒకవేళ ఆంక్ష‌లు విధించినా, నిఘా పెట్టినా టీనేజీ పిల్ల‌లు మాన‌సిక అప‌రిప‌క్వ‌త‌తో దారుణ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. చిన్న త‌నం నుంచి విలువ‌ల‌తో కూడిన పెంప‌కం లేక‌పోవ‌డం వ‌ల‌న ఇన్ని స‌మ‌స్య‌లు చెల‌రేగుతున్నాయి. పిల్ల‌వాడు పుట్టిన ద‌గ్గ‌ర్నుంచి అత‌నికి ఎటువంటి విష‌యాలు నేర్పించాలి? పెంప‌కంలో సంస్కృతీ, సంప్ర‌దాయాల ప్రాముఖ్య‌త ఏమిటి? త‌ల్లిదండ్రులు చేస్తున్న పొర‌పాట్లపై ప్ర‌ముఖ విద్యావేత్త డాక్ట‌ర్ ఆర్.బీ. అంకం గారు రాసిన ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కం ఇప్పుడు పేరేంటింగ్ కు దిక్సూచిగా మారింది. ఈ పుస్త‌కంలో ఉన్న మంచి విషయాల‌పై ప్ర‌ముఖ సంఘ సేవ‌కురాలు శ్రీమ‌తి స‌త్య‌వాణి గారు వెల్ల‌డించిన అభిప్రాయాల‌ను ఈ వీడియోలో మీరు చూడండి.

 

ప్ర‌తీ మ‌నిషి ఆ ‘సంబంధం’ విలువ‌ తెలుసుకోవాల్సిందే!

 

ఈ క్ష‌ణం మీ జీవితం అద్భుతంగా ఉందా? లేక అస్త‌వ్య‌స్థంగా ఉందా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం అంత సుల‌భం ఏమీ కాదు. ఎందుకంటే జీవితం అద్భుతంగా ఉండ‌టం అంటే చేతినిండా డ‌బ్బు, కోరుకున్న స‌దుపాయాలు ఉండ‌టం కాదు. మాన‌సికంగా ఆనందంగా ఉండ‌టం.ఎంత మంది అలా ఉన్నారని అడిగితే ఈ రోజుల్లో అవును నేను ఉన్నా అని ట‌క్కున‌ స‌మాధానం చెప్పేవాళ్లు చాలా త‌క్కువ మందే ఉన్నారు. ఎందుకంటే సాంకేతికంగా ఎంత ఎదిగినా మాన‌వ సంబంధాల విష‌యంలో ఇప్పుడు మ‌నం రోజురోజుకీ తీసిక‌ట్టుగానే ఉన్నాం. ఒక మ‌నిషి జీవితం గొప్ప‌గా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? అత‌ను అత్యుత్త‌మంగా ప్రేమించే వ్య‌క్తి, లేదా వ్య‌క్తుల‌తో అత‌ని సంబంధాలు స‌రిగా ఉన్నాయ‌ని అర్ధం. మీ ఆత్మీయుల‌తో మీ సంబంధాలు స‌రిగా లేవంటే మీరు ఎప్ప‌టికీ ఆనందాన్ని సాధించలేని ఒక విఫ‌ల వ్య‌క్తిగానే మిగిలిపోతారు. ఎందుకంటే మంచి సంబంధాలే మంచి జీవితం.

 

 

సంబంధాలు విత్త‌నాలు లాంటివి!

 

బాగా దున్నిన పొలంలో మీరు విత్త‌నాలు నాటారు అనుకోండి. మీరు వాటిని ఎంత అపురూపంగా కాపాడాల్సి ఉంటుంది. మొల‌క‌లు వ‌చ్చి ఏపుగా పెరిగి ఫ‌ల‌సాయం వ‌చ్చేవ‌ర‌కు అత్యంత జాగ్ర‌త్త‌గా వాటిని చూసుకోవాలి. మ‌న ఆత్మీయుల‌తో, మ‌న శ్రేయోభిలాషుల‌తో మ‌నం కొన‌సాగించాల్సిన సంబంధాల‌ను కూడా విత్త‌నాల్లా నాటిన ద‌గ్గ‌ర్నుంచి ఎదిగే వ‌ర‌కూ అప్ర‌మ‌త్తంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స‌రిగ్గా కాపాడుకోలేక‌పోతే విత్త‌నం ఎలా అయితే మొక్క‌గా మారి ఫ‌ల‌సాయం ఇవ్వ‌దో ..సంబంధాల‌ను స‌రిగా కాపాడుకోలేక‌పోతే మ‌నం ఎప్ప‌టికీ విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా త‌యారుకాలేం. మ‌న జీవితంలో అన్ని సంబంధాలు చాలా చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యం మ‌నం అప‌రిమితంగా ప్రేమించే వ్య‌క్తుల‌తో మ‌న సంబంధాలు ఎలా ఉన్నాయ‌న్న‌దే. వాళ్ల‌ను స‌రిగా ప్రేమించిన‌ప్పుడే మ‌న జీవితం ఏపుగా పెరిగిన పంట‌లా స‌స్య‌శ్యామ‌లం అవుతుంది. లేదు అంటే విత్త‌నాలు వేసి నిర్ల‌క్ష్యం చేసిన పంట‌లా క‌ళావిహీనం అవుతుంది. అప్పుడు వ్య‌వ‌సాయం క్షేత్రంలోనే కాదు జీవితంలోనూ మిగిలేది బీడు వారిన వేధ‌నాభ‌రిత అనుభ‌వ‌మే.

 

 

తేడా వ‌స్తే సంబంధాలే మీ పాలిట మందుపాత‌ర‌లు!

 

మ‌నం జీవితంలో కృషి చేసి చాలా విష‌యాల్లో అత్యున్న‌త స్థాయికి ఎదుగుతాం. అయితే ఎంత ఎదిగినా మానవ సంబంధాలు విష‌యంలో స‌రైన విధంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతే అదంతా వ్య‌ర్ధ ప్ర‌య‌త్నంగా మిగిలిపోతుంది. సంబంధాల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేని వారి జీవితం చింద‌ర‌వంద‌ర అవుతుంది. సంబంధాల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేని ఆ అస‌మ‌ర్ధ‌త ఎలాంటిదంటే మందుపాత‌ర‌ల‌తో నిండి ఉన్న మైదానంలో ఆట ఆడ‌టం లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు మందుపాత‌ర మీద కాలు వేయ‌డం అది పేల‌డం ఖాయంగా జ‌రిగి తీరుతుంది. అప్పుడు మీ సామ‌ర్ధ్యాలు, మీ బ‌లాలు , మీ డ‌బ్బు ఏవీ మిమ్మ‌ల్ని ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌లేవు. అంద‌రితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయో ఎప్పటిక‌ప్పుడు స‌మీక్ష చేసుకోవాల్సిందే. సంబంధాలు లింక్ ఏ మాత్రం బ‌ల‌హీనంగా ఉన్నా అది ఎప్పుడైనా తెగిపోవ‌చ్చు. అంత‌వ‌ర‌కూ తెచ్చుకోకుండా ముందుగానే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని దాన్ని అతికించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. లేదంటే ఆ లింక్ తెగిపోవ‌డం మాత్ర‌మే కాదు. మీరు అడుగుపెట్టే మైదానంలో ముందుపాత‌ర‌లా త‌యార‌వుతుంది. అప్పుడు మీ జివిత‌మే ఇబ్బందుల్లో ప‌డొచ్చు. సంబంధాల విష‌యంలో ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంటూ, ప్రేమిస్తూ ప్రేమ‌ను పొంద‌డ‌మే విజ‌య‌వంత‌మైన వ్య‌క్తుల ల‌క్ష‌ణం.

 

 

వ‌స్తువుల్ని కాదు వ్య‌క్తుల్ని ప్రేమించండి!

 

ఒక పెద్ద వ్యాపారవేత్త త‌న‌ భార్య‌కు ఆమె పుట్టినరోజు సంద‌ర్భంగా ఒక ఖ‌రీదైన కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు. కారు తాళాల‌తో పాటు ఒక క‌వ‌ర్ ను కూడా ఆమెకు ఇచ్చాడు. కొత్త కారులో ఉత్సాహంగా స్నేహితురాళ్ల‌తో షికారుకెళ్లిన ఆమె వేగంగా కారును పోనిచ్చి ప్ర‌మాదం చేసింది. కారులో మ‌నుష్యుల‌కు గాయాలు కాన‌ప్ప‌టికీ కారు మాత్రం బాగా దెబ్బ‌తింది. ఆమె చేసిన ప‌నికి తిట్టుకుంటూ ఆమె స్నేహితురాళ్లు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వ‌చ్చారు. ఆమెకు భ‌యం వేసింది. క‌నీసం కాస్త డ‌బ్బులు ఇస్తే పోలీసులు ఏమీ అన‌ర‌న్న ఉద్దేశంతో భ‌ర్త ఇచ్చిన క‌వ‌ర్ ను తెరిచింది. అందులో డ‌బ్బులు లేవు ఒక లెట‌ర్ ఉంది. అందులో ఇలా ఉంది. నీకు స‌రిగా డ్రైవింగ్ రాద‌ని నాకు తెలుసు. నువ్వు కారుకు యాక్సిడెంట్ చేస్తే దాన్ని అక్క‌డే వ‌దిలి వ‌చ్చేయ్. దానికి ఇన్సూరెన్స్ ఉంది. ఆ కారు ఎంత ఖ‌రీదైనదైనా నీ అంత ఖ‌రీదైంది కాదు. నువ్వు నాకు చాలా ముఖ్యం. అని రాసి ఉంది. భార్య‌పై త‌న ప్రేమ‌ను అత‌ను వ్య‌క్త‌ప‌రిచిన విధానం, వ‌స్తువు కంటే త‌ను అత్యుత్తంగా ప్రేమించే వ్య‌క్తే ముఖ్య‌మ‌ని అత‌ను చెప్ప‌డం వాళ్ల సంబంధాన్ని పటిష్ఠం చేస్తుంది. అటువంటి సంబంధాల‌ను నిర్మించుకోవ‌డం, మీరు బాగా ప్రేమించే వ్య‌క్తుల‌కు మీ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ వాళ్ల‌తో స‌రైన బంధం ఏర్ప‌రుచుకోవ‌డం మీ జీవితంలో చాలా ముఖ్యం.

 

 

గుడి మెట్ల‌కు కోర్టు మెట్ల‌కు తేడాను గుర్తించాలి!

 

ఈ ఆధునిక యుగంలో మాన‌వ సంబంధాల‌ను స‌రిగా నిర్వ‌హించుకోలేక చాలా మంది విఫ‌ల వ్య‌క్తులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా యువ జంట‌లు చిన్న స‌మ‌స్య రాగానే విడాకుల కోసం కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. స‌మ‌స్య‌ను సామ‌రస్యంగా ప‌రిష్క‌రించుకుని సంబంధాల‌ను తిరిగి నెల‌కొల్పుకుందామ‌న్న రాజీ ధోర‌ణి కాన‌రావ‌డం లేదు. ఇదే ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. ప్రతీ పంట‌లో క‌లుపు మొక్క‌లు ఎలా అయితే వ‌స్తాయో ప్ర‌తీ సంబంధాల్లోనూ అపోహ‌లు, అపార్ధాలు అలానే వ‌స్తాయి. క‌లుపు మొక్క‌ల‌ను తీసేసి వ్య‌వ‌సాయాన్ని ఎలా అయితే కాపాడుకుంటామో అపార్ధాల‌ను తొలిగించుకుని సంబంధాల‌ను కూడా అలానే కాపాడుకోవాలి. మ‌న‌కు ఏమైనా చిన్న బాధ వ‌చ్చిన‌ప్పుడు, క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌శాతంగా ఉంటే మ‌న ఇష్ట‌దైవం చెంత‌కు వెళతాం క‌దా? అక్క‌డ మ‌న గోడు విని స‌మాధానం చెప్ప‌ని దేవుడు ఉన్నా కాస్త ప్ర‌శాంతంగా ఆలోచిస్తే బంధం యొక్క విలువు తెలుస్తుంది. అదే కోపంతో, ఆవేశంతో కోర్టుకు వెళితే అక్క‌డ మీ మాట వినే జ‌డ్జీలు మీ బంధానికి ముగింపు ప‌లుకుతారు. జీవితంలో అన్నింటిక‌న్నా సంబంధాలే ముఖ్య‌మ‌ని , మ‌న‌ల్ని బాగా ప్రేమించే మ‌నుష్యులే ముఖ్య‌మ‌ని గుర్తిస్తేనే మ‌నుగ‌డ సాధ్యం.

 

 

సంబంధం అనే అకౌంట్ లో ప్రేమ‌ను క్రెడిట్ చేయండి!

 

అస‌లు మంచి ప్రేమ పూర్వ‌క సంబంధాన్ని ఎలా నెల‌కొల్పుకోవాలి. అందర్నీ వేధించే ప్ర‌శ్న ఇది. ఎందుకంటే ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కొన్ని సార్లు త‌ప్పులు జ‌రుగుతాయి. అటువంటి మ‌న‌కు ఇష్ట‌మైన వాళ్ల‌తో మ‌న సంబంధం ప్ర‌మాదంలో ప‌డుతుంది. అలా జ‌రగ‌కుండా ఉండాలంటే సంబంధం అనే అకౌంట్ లో వీలున్నన్ని సార్లు ప్రేమ‌ను క్రెడిట్ చేయండి. చిన్న చిన్న‌ త‌ప్పుల‌కు కొంత డెబిట్ అవుతున్నా ప్రేమ అనే క్రెడిట్ అధిక మొత్తంలో ఉన్న‌ప్పుడు మీ సంబంధం అనే అకౌంట్ లో ఎప్పుడూ ఖాతా నిండుగా ఉంటుంది. జీవితం ఆనంద‌మ‌యం కావాలంటే మీరు ప్రేమించే వ్యక్తుల‌తో మంచి సంబంధాల‌ను నెల‌కొల్పుకోవ‌డ‌మే. మీ సంబంధాల‌ను కాపాడుకోండి. మీ ఆనందాన్ని కాపాడుకోండి. ఈ రెండు కాపాడుకుంటే చాలు మీ జీవితం ఇక ఆనంద‌మ‌య‌మే.

 

(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)

 

 

ఇస్తూ ఉంటే మీకు వ‌స్తూ ఉండేది ఏంటో తెలుసా??

 

ఈ ప్ర‌పంచంలో క‌ష్ట‌మైన విష‌యాల్లో సంపాద‌న ఒక‌టి. అది డబ్బు కావ‌చ్చు కీర్తి కావ‌చ్చు.. వాటిని సంపాదించడం ఆ సంపాదించిన వాటిని ప‌దిలప‌ర్చుకోవ‌డం అంత సులువైన‌ విష‌యం కాదు. చిన్నపాటి పొర‌పాటు వ‌ల‌నో లేక వ్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌ను కోల్పోవ‌డం వ‌ల‌నో ఇవ‌న్నీ స్వ‌ల్ప‌కాలంలోనే మ‌నం నుంచి దూరం కావ‌చ్చు. అయితే త‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాన్ని ప‌దిమందికి పంచే సేవా దృక్ఫ‌ధం ఉన్న‌వారే శాశ్వ‌త ఐశ్చ‌ర్య‌వంతులుగా మిగిలిపోతారు. ఎంత ఇస్తే అంత తిరిగి వ‌స్తుందన్న ప్ర‌కృతి సూత్రాన్ని అవ‌గ‌తం చేసుకుని ఆచ‌ర‌ణ‌లో పెడితే అత్యద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. కానీ మ‌నుష్యుల‌ను వాడుకుంటూ , వ‌స్తువుల‌ను ప్రేమిస్తూ సృష్టి ధ‌ర్మానికి, ప్రాథ‌మిక విలువ‌ల‌కు తిలోద‌కాలిస్తూ స్వార్ధం, డ‌బ్బు సంపాద‌నే ప్ర‌ధాన వ్యాప‌కంగా చేసుకున్న నేటి స‌మాజంలో తిరిగి ఇవ్వ‌డం అన్న‌ది ప‌రిమితంగానే క‌నిపిస్తోంది. వ్య‌క్తుల‌తో పాటు సంస్థ‌లకు ఉండాల్సిన సామాజిక బాధ్య‌త‌లు, విలువ‌ల‌పై ‘కెరీర్ టైమ్స్’ అందిస్తున్న ప్ర‌త్యేక క‌థనం.

 

 

నిన్ను పెంచిన స‌మాజానికి తిరిగి నువ్వేమిస్తున్నావ్ ?

 

బిల్ గేట్స్ , మార్క్ జుకెర్ బ‌ర్గ్ వంటి అప‌ర కుబేరులు స‌మాజ సేవ కోసం ఎన్నో మిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చిస్తున్నారు. పేద దేశాల్లో వివిధ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం త‌మ ఫౌండేష‌న్ ల ద్వారా కృషి చేస్తున్నారు. అలాగే మ‌నం దేశంలో టాటా , బిర్లా, ఇన్ఫోసిస్ వంటి కార్పోరేట్ సంస్థ‌లు కార్పోరేట్ సామాజిక బాధ్య‌త‌లో భాగంగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి. వీళ్లు ఎందుకు ఇంత భారీ మొత్తాల‌ను సామాజిక సేవ‌కు ఖ‌ర్చుపెడుతున్నారు? తూతూమంత్రంగా కాకుండా ఏదో నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని కాకుండా మ‌నం పైన చెప్పుకున్న సంస్థ‌లు ఒక స్థిర‌మైన ల‌క్ష్యంతో, దృక్ఫ‌ధంతో ఈ సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నాయి. ఎందుకు? ఎందుకంటే..త‌మ‌ను అంత వాళ్ల‌ను చేసిన స‌మాజానికి తిరిగి ఇవ్వ‌డం వ‌ల‌న వాళ్ల సంప‌ద మ‌రింత వృద్ధి చెందుతుంది అన్న ప్రాథ‌మిక ప్ర‌కృతి సూత్రం వాళ్ల‌కు తెలుసు కాబ‌ట్టి. వ్య‌క్తులైనా , సంస్థ‌లైనా ముందుగా తెలుసుకోవాల్సిన విష‌య‌మేమిటంటే త‌మ ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన స‌మాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడు మాత్ర‌మే వాళ్లు సంపాదించిన సంప‌ద‌కు సార్ధ‌క‌త చేకూరుతుంది. వాళ్ల సంప‌ద మ‌రింతగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే నీ అభివృద్ధిలో, సంప‌ద‌లో స‌మాజానికి కూడా వాటా ఉంది. ఆ వాటాను నువ్వు న్యాయ‌బ‌ద్ధంగా తిరిగి చెల్లిస్తే నీ బాధ్య‌త నెర‌వేరుతుంది. మాన‌సిక సంతృప్తి ల‌భిస్తుంది.

 

 

స్ఫూర్తినిచ్చే వ్య‌క్తుల‌కు కొదువ లేదు!

 

మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాన్ని ఎటువంటి లాభం ఆశించ‌కుండా, నిస్వార్ధంగా ఎదుటివాళ్ల‌కు ఇవ్వ‌డం అంటే మామూలు విష‌యం కాదు. వ్య‌క్తిగ‌త స్వార్ధం పెరిగిపోతున్న స‌మాజంలో అటువంటి ల‌క్ష‌ణాలు ఉన్న మ‌నుష్యులు అరుదుగానే క‌నిపిస్తారు. కానీ ఉన్న కొంద‌రు ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కంగా నిలిచి క‌నుమ‌రుగవుతున్న సామాజిక సేవ‌కు చిరునామాగా నిలుస్తారు. అటువంటి వ్య‌క్తే ల‌య‌న్ విజ‌య్ కుమార్ గారు. నిజ‌మైన సంపాద‌న అంటే స‌మాజానికి చేత‌నైనంత సాయం చేయ‌డమే అని న‌మ్మే నిస్వార్ధ‌ప‌రులు విజ‌య్ కుమార్ గారు. కోట్ల రూపాయ‌ల విలువ చేసే స్థ‌లాన్ని మార్కెట్ యార్డుకు ఉచితంగా ఇచ్చారు. తాను సంపాదించిన దాంట్లో అధిక భాగాన్ని ప్ర‌తీ రోజూ ఏదో ఒక సాయం కోసం దానం కోసం ఒక మంచి ప‌ని కోసం వినియోగిస్తూ ఉంటారు. ఇలా ఇస్తూ పోతే ఎలా? అన్న స్నేహితుల‌తో , శ్రేయోభిలాషుల‌తో ఆయ‌న ఒక‌టే మాట చెపుతూ ఉంటారు. నువ్వు ఎంత ఇస్తే అంత తిరిగి వ‌స్తుంది. క‌ష్ట‌ప‌డి సంపాదించాలి.ఆ సంపాదించిన మొత్తంలో మ‌న వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు కావ‌ల్సినంత ఉంచుకుని మిగిలిన దాన్ని తిరిగి మంచి ప‌నుల‌కు ఖ‌ర్చు చేయాలి. అప్పుడే ఎప్పుడూ ధ‌న‌వంతులుగా ఉంటాం. అని. మంచి మ‌న‌స్సుతో , నిస్వార్ధంగా ఇచ్చిన దానం, చేసిన సాయం ఎక్క‌డికీ పోవు. మ‌ళ్లీ తిరిగి మీ వ‌ద్ద‌కే చేరుతాయి. ఎందుకుంటే మీరు మ‌ళ్లీ వేరొక‌రికి స‌హాయం చేస్తార‌ని. అది ప్ర‌కృతి సూత్రం. ఇందులో ఎటువంటి మార్పు లేదు.

 

మ‌నుష్యులు ఉన్న‌ది ప్రేమించేందుకు..వాడుకునేందుకు కాదు!

 

ఒక యువ‌కుడు పొట్ట చేత‌ప‌ట్టుకుని బ‌తుకు తెరువు కోసం మ‌హా న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చాడు. రోడ్డు ప‌క్క‌న చిన్న టీ దుకాణం ప్రారంభించి జీవ‌నోపాధిని పొంద‌డం ప్రారంభించాడు. ఒక మ‌ధ్య వ‌య‌స్కుడు వ‌చ్చి నీతో పాటు నేను కూడా ప‌నిచేస్తా ఎంతో కొంత ఇవ్వు చాలు అన్నాడు. దానికి స‌రేన‌న్న యువ‌కుడు అత‌న్ని కూడా త‌న‌తో పాటు ఉంచుకున్నాడు. శుభ్ర‌త‌ను, నాణ్య‌త‌ను పాటించడం వ‌ల‌న కొద్ది కాలంలోనే అత‌ని టీ షాప్ కు మంచి పేరు వ‌చ్చింది. క‌స్ట‌మ‌ర్లు కూడా పెరిగారు. దాంతో ఆదాయ‌మూ పెరిగింది. త‌ర్వాత ఆ షాప్ కు మెల్ల‌గా విస్త‌రించి హోట‌ల్ గా మార్చాడు. అందులోనూ మంచి లాభాలు వ‌చ్చాయి. అలా ఒక ప‌ది సంవ‌త్సరాల కాలంలోనే అత‌ను ఒక ఫైవ్ స్టార్ హోట‌ల్ కు అధిప‌తిగా మారిపోయాడు. అత‌ని ఎదుగుద‌ల‌లోని ప్రతీ మ‌లుపులోనూ అత‌నిపాటు ఆ మ‌ధ్య వ‌య‌స్కుడు కూడా ఉన్నాడు. ఫైవ్ స్టార్ హోట‌ల్ అధిప‌తి అయ్యాక ఆ యువ‌కుడు ఆ ముసలివాడ్ని పిలిచి ఒక బ్రీఫ్ కేస్ నిండా డ‌బ్బు ఇచ్చి ఎక్క‌డికైనా వెళ్లి సుఖంగా ఉండు అని చెప్పాడు. అత‌ని మాట‌ల‌కు చిన్న న‌వ్వు న‌వ్విన ఆ ముస‌లివాడు ఆ బ్రీఫ్ కేస్ ను అక్క‌డే వ‌ద‌లి వెళ్లిపోయాడు. ముస‌లివాడి వైఖ‌రి ఆ యువ‌కుడికి బొత్తిగా అంతుబ‌ట్ట‌లేదు. అదే విష‌యాన్ని త‌న త‌ల్లితో చ‌ర్చించాడు. అత‌ను ఎందుకు అంత పెద్ద మొత్తంలో ఉన్న డ‌బ్బును కాద‌న్నాడు. ఏమైనా పిచ్చివాడా అని అడిగాడు. దానికి అత‌ని త‌ల్లి బాబూ ‘అత‌ను నీ ద‌గ్గ‌ర ఏదో ఆశించి నీతో పాటు క‌లిసి ప‌నిచేయ‌లేదు. నీతో పాటు పాటు క‌లిసి ఉండాల‌నుకున్నాడు. నీపై వాత్స‌ల్యం, ప్రేమ‌ను పెంచుకున్నాడు. అంతేకానీ నువ్వు ఇచ్చే డ‌బ్బుకు ఆశ‌ప‌డి కాదు. ఈ ముసలిత‌నంలో అత‌నికి కావాల్సింది ప్రేమ‌గా చూసే మ‌నుష్యులు త‌ప్ప డ‌బ్బులు కాదు. ఆ డ‌బ్బులు అత‌ను ఏం చేసుకుంటాడు. నువ్వు చాలా పొర‌పాటు చేసావు. ఒక వ‌స్తువులాగే మ‌నుష్యుల‌ను కూడా వాడుకున్నావు. మ‌నుష్యుల‌ను ప్రేమించాలి. కానీ అవ‌స‌రం తీరాక ప‌క్క‌న పెట్టకూడదు’. అని చెప్పింది. ఈ క‌థ‌లోని యువ‌కుని లాగే ఇప్పుడు చాలా మంది మ‌నుష్యులు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వాడి పారేయాల్సిన సెల్ ఫోన్ ను జేబులో భ‌ద్రంగా దాచుకుని ప్రేమిస్తున్నారు. ప్రాణంగా ప్రేమించాల్సిన మ‌నుష్యుల‌ను విదిలించి కొడుతున్నారు. ఇటువంటి ప్ర‌వ‌ర్త‌నే ఇప్పుడు సామాజిక‌, మాన‌సిక అశాంతికి దారితీస్తోంది.

 

 

భ‌గ‌వంతుడు నీలోనే ఉన్నాడు..న‌మ్మ‌కంతో ప‌ని ప్రారంభించు!

 

నువ్వు నిస్వార్ధంగా నువ్వు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని తిరిగి స‌మాజానికి ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు నీకు అంత‌కు రెండింత‌లు సంప‌ద వ‌స్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భ‌గ‌వంతుడు అటువంటి నిస్వార్ధ సేవ‌ను కొన‌సాగించేందుకు మీకు స‌హాయం చేస్తాడు. మ‌హేష్ బాబు ఖ‌లేజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘దేవుడు ఎక్క‌డో ఉండ‌డు. మ‌న‌లోనే ఉంటాడు. సాటి మ‌నిషికి స‌హాయం చేస్తామ‌ని మీరు గ‌ట్టిగా, మ‌న‌స్ఫూర్తిగా అనుకోగానే ట‌క్కున బ‌య‌ట‌కు వ‌స్తాడు’. ఇందులో సందేహం లేదు. ల‌య‌న్ విజ‌య్ కుమార్ లాంటి సేవానిర‌తి క‌ల‌వారు చెప్పేది కూడా ఇదే. నిస్వార్ధంగా సేవ చేయాలి అనుకున్న‌ప్పుడు మీకు సంప‌ద వ‌స్తూనే ఉంటుంది. అది ఎక్క‌డికీ పోదు అని. న‌మ్మ‌కంతో ఒక ప‌ని ప్రారంభిస్తే నువ్వు స‌గం చేస్తే చాలు మిగ‌తా స‌గం భ‌గ‌వంతుడే పూర్తి చేస్తాడు. ప్ర‌కృతే నెర‌వేరుస్తుంది. కావాల్సింది న‌మ్మ‌కం మాత్ర‌మే. నువ్వు ప‌క్క‌వాడికి ఏదైనా ఇవ్వాల‌నుకుంటే బాధ‌ప‌డాల్సిన అవ‌సర‌మే లేదు. అంత‌కు రెండింత‌లు నీ వ‌ద్ద‌కు వ‌చ్చి చేరుతుంది. ఇందులో సందేహమే లేదు.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

ట్యూట‌ర్స్ ప్రైడ్ సంస్థ వారు చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాలు

 

 

 

 

ఈ త‌ప్పులు చేస్తే మీరు గొప్ప‌వాళ్లు కావ‌డం ఖాయం!

 

ఈ టైటిల్ ను చ‌ద‌వ‌గానే త‌ప్పులు చేస్తే గొప్ప‌వాళ్లు కావ‌డం ఏంటి? అన్న అనుమానం మీకు త‌ప్ప‌క క‌లుగుతుంది. ఆ త‌ర్వాత ప్ర‌య‌త్నించ‌డం అంటే త‌ప్పులు చేయ‌డ‌మే క‌దా? అన్న ఆలోచ‌న చేస్తారు. అయితే మ‌నం ఇప్పుడు మ‌నం చ‌ర్చించుకుంటున్న విష‌యం త‌ప్పుల నుంచి కొత్త విష‌యాలను వేగంగా నేర్చుకోవ‌డం. జీవితం అనేది అనుభ‌వాల స‌మాహారం. మ‌న‌కు ఎదురైన అనుభ‌వాలు, స‌వాళ్లే మ‌న‌ల్ని విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా నిల‌బెడ‌తాయి. అయితే మ‌న సొంత అనుభ‌వాల నుంచి మాత్ర‌మే నేర్చుకుందాం అనుకుంటే విలువైన స‌మ‌యం వృధా అవుతుంది. అదే అనుభ‌వ‌జ్ఞుల అనుభ‌వాల నుంచి పాఠాల‌ను తీసుకుని వాటి ఆధారంగా ప్రయత్నం చేసి ఆ క్రమంలో తప్పులు చేసి వాటిని వేగంగా సరిదిద్దుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఒక విజయవంతమైన వ్యక్తి జీవితం నుంచి మనం ఎటువంటి సారాంశాన్ని సంగ్రహించాం..దాన్ని ఎంత వరకూ అమలు చేయగలిగాం..అన్న రీతిలో ప్రణాళిక వేసుకుని ముందు సాగితే తక్కువ సమయంలో ఎక్కువ తప్పులు చేసి వాటికి పరిష్కార మార్గాలు కనుక్కుని స్వల్ప కాలంలోనే విజేతగా నిలిచేందుకు అవకాశం ఉంటుంది.

 

 

సమయం లేదు మిత్రమా!

 

ఈ ఆధునిక యుగంలో చేసే పనిని వేగంగా పూర్తి చేయాలి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా మనల్ని పక్కకు తోసుకుంటూ వందలాది మంది ముందుకు వెళ్లిపోతారు. పోటీలో మనం వెనకబడి పోతాం. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అది పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పనిని, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నప్పుడు దాన్ని సాధించడం అన్నది అంత సులభమైన విషయం కాదు. ప్రతీ రోజూ ఏదో ఒక తప్పు చేసేస్తూ ఉంటాం. అసలు తప్పు చేస్తేనే మనం సరైన దారిలో ఉన్నట్టు. అయితే ఆ అనుభవం నుంచి పాఠాల నేర్చుకుందాం. మెల్లగా నేర్చుకుందాం అంటే ఇప్పుడు కుదిరే పని కాదు. అందుకే విజేతల జీవితాలను వాళ్ల అనుభవాలను కేస్ స్టడీస్ గా తీసుకుని వాళ్లు 2 ఏళ్లలో చేసిన పనిని మీరు 2 నెలల్లో, అలాగే వాళ్లు 20 ఏళ్లలో పూర్తి చేసిన పనిని మీరు 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే ఈ పోటీలో మీరు నెగ్గుకు రాగలరు. తీరిగ్గా స్వీయ అనుభవాల నుంచి నేర్చుకుందామంటే రేస్ లో మీరు చివరి నిలవడం ఖాయం. కాబట్టి సమయం లేదు పనిని ఇప్పుడే మొదలు పెట్టాలి. స్ఫూర్తి పొందాలి. ప్రణాళిక వేసుకోవాలి. తప్పులు చేయాలి.కానీ వాటిని త్వరగా చేసేసి త్వరగా విజయ శిఖరాన్ని చేరుకోవాలి.

 

 

తీసుకోవాల్సింది అనుభవాలను మాత్రమే!

 

మనం వేగంగా ఫలితాలు సాధించాలంటే విజయవంతమైన వ్యక్తుల అనుభవాలను తీసుకుని కేస్ స్టడీ చేసి ముందుకు సాగాలని మనం చెప్పకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మనం వాళ్ల నుంచి స్ఫూర్తి పొందాలి..వాళ్ల ప్రయాణాన్ని అధ్యయనం చేయాలి. అంతేకానీ వాళ్లు చేసిన పనిని మీరు కూడా చేయాలి అనుకోకూడదు. ఎవరో చేసిన పనిని నువ్వు చేస్తే ఎప్పటికీ విజేతవు కాలేవు. నువ్వు విభిన్నమైన ఒక కొత్త పనిని ప్రారంభించి దాని కోసం కష్టపడాలి. దాని కోసం విజేతల ప్రయాణంలోని అనుభవాలను అధ్యయనం చేయాలి. త్వరగా నేర్చుకోవాలి. కానీ చివరికి నీ గమ్యం, నీ లక్ష్యం నీవే. అవి వేరే వాళ్లలా ఎప్పుడూ ఉండకూడదు. నీవు చేస్తున్న పనిలో , నీ ప్రయాణంలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఈ విషయాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ నిరంతరం లక్ష్య సాధన కోసం కృషి చేస్తే విజయం త్వరగా వరిస్తుంది.

 

 

చేసే పనిని కొత్తగా చేయడమే విజయం!

 

ఒక ప్రముఖ ఇంగ్లీష్ రచయిత చెప్పినట్టు విజేతలు ఎప్పుడూ ఎవరూ చేయని కొత్త కొత్త పనులు చేయరు..చేసే పనినే కొత్తగా చేస్తారు. ఈ మాటను ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఒక లక్ష్యాన్ని, ఒక పనిని ఎంచుకుని దాన్ని విభిన్నంగా, వినూత్నంగా చేయడమే విజయం అంటే. ఫలానా పని చేసి ఒకతను విజయవంతంఅయ్యాడని మనం కూడా అలాంటి పనిని చేయాలనుకోవడం మనల్ని వైఫల్యానికి చేరువ చేస్తుంది. అతను చేసిన పనిని తీసుకో..దాన్ని కొత్తగా ఎలా చేయగలవో ఆలోచించు..అతని అనుభవాలను, తప్పులను గమనించు. వాటి ఆధారంగా తక్కువ సమయంలో విజయం సాధించు. ఇదే సూత్రం. ఒక స్వల్పకాలిక లక్ష్యం పెట్టుకుని తప్పులు జరుగుతున్నా, నిరాశ కలిగిస్తున్నా అధైర్యపడకుండా ముందుకు సాగాలి. చేయాల్సిన తప్పులు అన్నీ చేసేయ్. వాటి నుంచి విలువైన పాఠాలు నేర్చుకో. కానీ చేయాల్సింది తొందరగా చెయ్.

 

 

విద్యా విధానంలోనే దీనికి బీజం పడాలి!

 

మన విద్యా వ్యవస్థలో ఒక లోపం ఉంది. ఒక ఉపాధ్యాయుడు తాను కోర్సులో భాగంగా నేర్చుకున్న విషయాలనే విద్యార్ధులకు భోధిస్తాడు. ప్రశ్నలు, సమాధానాలు అన్నీ రెడీగా ఉంటాయి. దీంతో విద్యార్ధి కేవలం బట్టి పట్టడం, పుస్తకాలను చూసి సమాధానాలు రాయడం వరకు మాత్రమే పరిమితమవుతున్నాడు. అలా కాకుండా పాఠ్య పుస్తకాల్లో సమాధానాలు లేని కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటిని సమాధానం తీసుకురండి అన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. వాళ్లు సమాధానం కోసం ప్రయత్నం చేస్తారు. వెతుకుతారు.. అడుగుతారు.. ఆలోచిస్తారు..వాళ్లు తప్ప సమాధానాలే తయారు చేసి తీసుకురావచ్చు. కానీ సమాధానాన్ని వెతికే క్రమంలో వాళ్లు చేసిన తప్పులు, పొరపాట్లు, అనుభవాలు వాళ్లు విజేతలుగా నిలుపుతాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దగ్గర అటువంటి విధానం లేదు. కనీసం లక్ష్య సాధకులు అయినా సరే ఈ విధానాన్ని అన్వయించుకుని గొప్పవాళ్ల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ల అనుభవాన్ని గ్రహించి, తక్కువ సమయంలో ఎక్కువ తప్పులు చేసి , విభిన్నంగా చేస్తే విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)