ప్రముఖ విద్యావేత్త, ట్యూటర్స్ ప్రైడ్ అధినేత డా. ఆర్.బి. అంకం గారు రాసిన ‘పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్తకం ఇప్పుడు మార్కెట్లో సంచలనం రేపుతోంది. ఈ ఆధునిక యుగంలో అతిపెద్ద సవాలుగా మారిన పిల్లల పెంపకంపై డా. అంకం గారు చెప్పిన పరిశోధనాత్మక అంశాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముక్కుసూటిగా చెప్పిన విషయాలు ప్రతీ తల్లిదండ్రుల గుండెను తాకుతున్నాయి. సాంకేతిక విప్లవం తెచ్చిన అభివృద్ధి మానవాళి జీవితాలను ఎంతగా సరళతరం చేసిందో తెలీదు కానీ పిల్లల పెంపకాన్ని మాత్రం అతిపెద్ద సవాలుగా మార్చింది. ఇంటర్నెట్ లో పిల్లలు ఏం చూస్తున్నారో, సోషల్ మీడియా ద్వారా ఏం నేర్చుకుంటున్నారో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మరోవైపు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన దురదృష్టకర పరిస్థితుల్లో పిల్లలకు మన సంస్కృతీ, సాంప్రదాయాలు, విలువలు నేర్పించే పెద్దలు కరువైపోయారు. దీంతో పర్యవేక్షణ లేక గౌరవ మర్యాదలు తెలీక ప్రతీ చిన్న విషయానికీ టెక్నాలజీపై ఆధారపడుతున్న నేటి తరాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ పుస్తకంలో డా.ఆర్.బి. అంకం గారు సవివరంగా పొందుపర్చారు.
పుస్తకంలోని ప్రతీ అక్షరం తల్లిదండ్రులకు, పిల్లలకు ఉపయోగపడే అద్భుతమైన విషయం కావడంతో విడుదలైన తక్కువ సమయంలోనే అశేష పాఠకాదరణ పొందింది. ఈ పుస్తకంలో శాస్త్రీయంగా, విపులంగా చర్చించిన విషయాలు నచ్చి మాజీ ఐపీఎస్ అధికారి జే.డీ. లక్ష్మీనారాయణ గారు అలాగే భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న భారతీయం సత్యవాణి గారు ముందుమాటను రాసారు. పుస్తకంలోని అద్భుత విషయం పాఠకులందరికీ చేరాలన్న ఉద్దేశంలో ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ ఎమెస్కో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అలాగే తాజాగా హైదరాబాద్ లో జరిగిన జాతీయ పుస్తక ప్రదర్శనలో ‘పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
జాతీయ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు ‘పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్తకాన్ని ప్రముఖంగా ప్రశంసించారు. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కూడా ఈ పుస్తకాన్ని , రచయిత డా. ఆర్.బి.అంకం గారిని ప్రత్యేకంగా అభినందించారు.