ఏపీ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది!

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష ( టెట్) పరీక్ష‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. టెట్ ప‌రీక్ష‌ను ఆన్ లైన్ లో నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వరి 17 నుంచి 27 వ‌ర‌కూ రోజూ రెండు సెష‌న్స్ గా ఈ పరీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వెల్లడించారు. ఈ ఏడాది టెట్ ప‌రీక్ష‌ను దాదాపు 3 ల‌క్ష‌ల మంది విద్యార్ధులు రాయొచ్చ‌న‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక్కో సెంట‌ర్ లో ఒక్కో సెష‌న్ కు దాదాపు 5 వేల మంది విద్యార్ధులు ప‌రీక్ష రాసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఏపీ టెట్ 2018 షెడ్యూల్

 

ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ  :  డిసెంబ‌ర్ 18 నుంచి జ‌న‌వ‌రి 1 వ‌ర‌కూ
ద‌ర‌ఖాస్తు రుసుముల చెల్లింపులు  :  డిసెంబ‌ర్ 18 నుంచి 30 వ‌ర‌కూ
హాల్ టిక్కెట్ డౌన్ లోడ్  :   జ‌న‌వ‌రి 9 నుంచి
ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ  :   జ‌న‌వ‌రి 17 నుంచి 27 వ‌ర‌కూ
సెష‌న్ 1  :   ఉద‌యం 9:30 నుంచి 12 గంట‌ల వ‌ర‌కూ
సెష‌న్ 2  :  మ‌ధ్య‌హ్నం 2:30 నుంచి సాయింత్రం 5 వ‌ర‌కూ
ప్రాథ‌మిక కీ విడుద‌ల‌  :   జ‌న‌వ‌రి 29 న
తుది కీ విదుద‌ల  :   ఫిబ్ర‌వ‌రి 6
తుది ఫ‌లితాలు  :   ఫిబ్ర‌వ‌రి 8 న