సామాజిక బాధ్య‌త‌కు చిరునామా ‘ట్యూట‌ర్స్ ప్రైడ్’

 

వ్యాపారం చేయ‌డం.. లాభాల‌ను సాధించ‌డం… కార్పోరేట్ రంగంలో ప్ర‌తీ కంపెనీ ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే. అయితే లాభార్జ‌నే ద్యేయంగా ప‌నిచేసే కొన్ని కంపెనీలు ఆ లాభాల వేట‌లో ప‌డి సామాజిక బాధ్య‌త‌ను విస్మ‌రిస్తాయి. పూర్తి స్థాయి వ్యాపార సంస్థ‌లుగా మారిపోయాక సామాజిక సేవ‌, బాధ్య‌త‌ల‌ను గాలికొదిలేస్తాయి. అయ‌తే కొన్ని సంస్థ‌లు మాత్రం ప్రారంభం నుంచి వ్యాపార ల‌క్ష్యాన్ని సాధిస్తూనే కీల‌కమైన సామాజిక బాధ్య‌త‌ను మాత్రం మ‌ర్చిపోకుండా నెర‌వేరుస్తూ ఉంటాయి. పురుడు పోసుకుని రెండేళ్లే అవుతున్నా సామాజిక బాధ్య‌త‌లో మాత్రం రెండు ద‌శాబ్దాల కంపెనీల‌కు ధీటుగా నిల‌బ‌డుతోంది ట్యూట‌ర్స్ ప్రైడ్.

 

 

ఆన్ లైన్ ట్యూట‌రింగ్, ఆన్ లైన్ త‌ర‌గ‌తులు అందించే సంస్థ‌గా ప్ర‌స్థానం ప్రారంభించిన ట్యూట‌ర్స్ ప్రైడ్ విద్యా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభించి ఇంకా రెండేళ్లు పూర్తి కాకుండానే ట్యూట‌ర్స్ ప్రైడ్ లో ప్ర‌స్తుతం 6 ల‌క్ష‌ల మంది ట్యూట‌ర్లు రిజిష్ట‌ర్ అయ్యారు. ఇది ఆన్ లైన్ ట్యూట‌రింగ్ రంగంలో ఒక న‌యా విప్ల‌వం అని చెప్పొచ్చు. అలాగే దాదాపు 50 వేల మంది విద్యార్ధులు ట్యూట‌ర్స్ ప్రైడ్ లో త‌మ పేరును రిజిష్ట‌ర్ చేసుకున్నారు. ట్యూట‌ర్స్ ప్రైడ్ లో ఒక విశిష్ఠ‌త‌, ప్ర‌త్యేకత ఏంటంటే ఇందులో దాదాపు 6500 కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అక‌డమిక్ తో పాటు నాన్ అక‌డ‌మిక్ లో ఎటువంటి కోర్సును అయినా నేర్చుకునేందుకు ట్యూట‌ర్స్ ప్రైడ్ లో ట్యూట‌ర్స్ అందుబాటులో ఉన్నారు.

 

 

రెండేళ్ల‌లో ఇన్ని ఘ‌న‌త‌లు సాధించిన ట్యూట‌ర్స్ ప్రైడ్ ఒకవైపు త‌న కార్య‌క‌లాపాల‌ను విస్త‌రిస్తూనే మ‌రోవైపు ప‌లు సామాజిక కార్య‌కలాపాల‌ను నిర్వ‌హిస్తోంది.సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌, మ‌హిళా సాధికార‌త‌, విద్య, వైద్యంపై దృష్టి సారించి ఆయా కార్య‌క్ర‌మాల‌కు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అత్యుత్త‌మ టీచ‌ర్ల‌ను స‌త్క‌రించే ఐటాప్ అవార్డుల కార్య‌క్ర‌మానికి గ‌డిచిన రెండేళ్లుగా ట్యూట‌ర్స్ ప్రైడ్ ప్ర‌ధాన స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అలాగే ఈ ఏడాది భారీ ఎత్తున నిర్వ‌హించిన లేడీ లెజెండ్స్ అవార్డు కార్య‌క్ర‌మానికి కూడా ప్ర‌ధాన స్సాన్స‌ర్ ట్యూట‌ర్స్ ప్రైడ్ సంస్థే. అలాగే ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను, స్పార్ట‌ప్ ల‌ను ప్రోత్సహించేందుకు నిర్వ‌హిస్తున్న వ‌ర్క్ షాప్ ల‌కు కూడా ఆర్థిక స‌హాయాన్ని చేస్తోంది.

 

 

వ‌చ్చే రెండేళ్ల‌లో ప్ర‌తీ ఇంటికీ విస్త‌రించాల‌ని ట్యూట‌ర్స్ ప్రైడ్ భావిస్తోంది. ప్ర‌తీ పిల్ల‌వాడు, ప్ర‌తీ త‌ల్లిదండ్రుల‌కు ట్యూష‌న్ లేదా ప్ర‌త్యేకమైన శిక్ష‌ణ కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు ట‌క్కున గుర్తుకు వ‌చ్చే సంస్థ‌గా రూపాంత‌రం చెందాల‌ని ట్యూట‌ర్స్ ప్రైడ్ యాజ‌మాన్యం ల‌క్ష్యం. పిల్ల‌ల భ‌ద్ర‌తే ప్ర‌ధాన అజెండాగా అదే స‌మ‌యంలో నాణ్య‌మైన ట్యూట‌ర్స్ ను అందించ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకుంది. అందుకోసం ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హించి ఆ త‌ర్వాత మాత్ర‌మే ట్యూట‌ర్స్ ను రిక్రూట్ చేసుకుంటోంది. అటు వ్యాపారంలోనూ ఇటు సామాజిక బాధ్య‌త‌లోనూ దూసుకుపోతున్న ట్యూట‌ర్స్ ప్రైడ్ కు ‘కెరీర్ టైమ్ ఆన్ లైన్’ ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది.

 

వైభ‌వంగా ఐటాప్ – 2018 అవార్డుల ప్ర‌ధానోత్సవం

 

అత్యుత్త‌మ ఉపాధ్యాయుల‌ను ఘ‌నంగా స‌త్క‌రించే ఐటాప్ 2018 అవార్డుల కార్య‌క్ర‌మం అక్టోబ‌ర్ 2 న హైద‌రాబాద్ లో ఘ‌నంగా జరిగింది. న‌గ‌రంలో హైటెక్ సిటీ స‌మీపంలో ఉన్న ట్రైడెంట్ హోట‌ల్ లో అంగ‌రంగ వైభ‌వంగా ఈ అవార్డుల వేడుకను నిర్వ‌హించారు. హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ట్యూట‌ర్స్ ప్రైడ్ సంస్థ ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హరించింది.

 

 

20 కి పైగా విభాగాల్లో అక‌డ‌మిక్, నాన్ అక‌డ‌మిక్ ఉపాధ్యాయుల‌ను ఐటాప్ 2018 అవార్డుల కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించారు. ఇందులో ఒక‌రికి మ‌హా మ‌హోపాధ్యాయ అవార్డు, 5 గురుకి జీవిత కాల సాఫ‌ల్య పుర‌స్కారం, 100 మందికి ఐటాప్ అవార్డులు అందుకున్నారు. అలాగే మ‌రో 70 మంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐటాప్ 2018 అవార్డు కోసం దాదాపు 700 మంది అక‌డ‌మిక్ , నాన్ అక‌డమిక్ ఉపాధ్యాయులు, కోచ్ లు, ప్రొఫెస‌ర్లు, డీన్ లు, ప్రిన్సిపాల్ లు నామినేష‌న్లు వేసారు. అత్యంత క‌ఠిన‌త‌ర‌మైన ఎంపిక ప్ర‌క్రియ అనంత‌రం జ్యూరీ సభ్యులు అవార్డు గ్ర‌హీత‌ల‌ను ప్ర‌క‌టించారు. నామినేష‌న్ వేసిన ప్ర‌తీ ఒక్క‌రూ కార్యక్ర‌మంలో పాల్గ‌నే వీలుండ‌టంతో దాదాపు 1000 మంది వ‌ర‌కూ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు.

 

 

దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి మొద‌లుకుని మెట్రో సిటీల్లో ఉన్న విశ్వ‌విద్యాల‌యాల్లో ప్రొఫెస‌ర్లుగా, డీన్లుగా ప‌నిచేస్తున్న వారు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌డం విశేషం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు, శ్రీ కొణిజేటి రోశ‌య్య గారు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణా శాస‌న మండ‌లి ఛైర్మ‌న్, స్వామి గౌడ్ గారు, తెలంగాణా బీసీ క‌మీష‌న్ ఛైర్మ‌న్ శ్రీ బీ.సీ. రాములు గారు, సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణా వాట‌ర్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్. శ్రీ వీర‌మ‌ళ్ల ప్ర‌కాశ్ రావు గారు, తెలుగు విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ శ్రీ. ఎస్.వీ. స‌త్య‌నారాయ‌ణ గారు, ప‌లువురు ఐఏఎస్ ఆఫీస‌ర్లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

 

చిన్న స్థాయి , గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయుల‌ను చిన్న చిన్న వేదిక‌ల‌పై స‌త్క‌రించ‌డం అన్న‌దే మ‌నం ఇప్ప‌టివ‌ర‌కూ చూసాం. కానీ ట్యూట‌ర్స్ ప్రైడ్ వారి స‌హ‌కారంతో ఐటాప్ 2018 లో ఉపాధ్యాయుల‌ను హైద‌రాబాద్ లో ఖ‌రీదైన ట్రైడెంట్ హోట‌ల్ లో వారికి ఒక ఆనంద అనుభూతిని పంచుతూ అందించ‌డం నిజంగా అభినంద‌నీయం.

 

ఈ దేశానికి ఏమైంది???

 

ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ…

ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి?

ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం.

కాలే సిగరెట్, బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా.

ధూమపానం చేయకండి. చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం.

ఆనందాన్ని ఎవరు కోరుకోరు…కానీ ఎంత మూల్యానికి..?

 

 

మనం సినిమాకు వెళ్లినప్పుడు ఈ యాడ్ ను ఎన్నోసార్లు చూసి ఉంటాం. నిజానికి ధూమపానం వలన ఈ దేశానికి ఏమైందో, ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తీర్పులు దేశ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేసి నిజంగానే ఈ దేశానికి ఏమైంది? అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్న మన సంస్కృతిని, వారసత్వాన్ని నిట్టనిలువునా పాతరేసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాశ్చాత్య దేశాలు ఇంకా కళ్లు తెరవక ముందే అత్యద్భుతమైన నాగరికతతో విరాజిల్లిన భారతదేశంలో ఇప్పుడు పాశ్చాత్య నాగరికతలను, వాళ్ల అసంబద్ధ పోకడలను అనుసరించాలన్న వెర్రి ఆలోచనలు ప్రబలుతున్నాయి. పైపై మెరుగులకు ఎప్పుడూ ఆకర్షించబడే ప్రజలను సరైన దారిలో పెట్టాల్సిన కోర్టులు, ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛ పేరుతో అనాగరిక చర్యలకు వంత పాడుతూ దాన్నే నిజమైన ప్రజాస్వామ్యమంటూ భారతదేశ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు. ఒకవైపు స్వయంప్రకటిత మేధావులు, మరోవైపు స్వేచ్ఛ , సమానత్వం పేరుతో భాధ్యతలను గాలికొదిలి కేవలం హక్కులు కోసం మాత్రమే మాట్లాడే ప్రబుద్దులు విచ్చలవిడిగా వీధుల్లో పడి ఘనమైన భారతీయ మూలాలను మూలకు నెట్టేస్తున్నారు.

 

 

ఈ మహిళలకు ఏమైంది? ఒకవైపు విచ్చలవిడితనం, మరోవైపు స్వేచ్ఛా దుర్వినియోగం..!!

 

ప్రపంచంలో భారతీయ మహిళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా ఒక కుటుంబాన్ని నిలబెడుతూ , తన బాధ్యతలను నెరవేరుస్తూ స్త్రీ అనే మాటకు పరిపూర్ణత చేకూరుస్తుంది. అనాది నుంచి పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు తగినంత స్వేచ్ఛ దొరకలేదు అన్న మాట వాస్తవమే. వారిని కేవలం ఒక వస్తువుగా చూడటం బాధ కలిగించే విషయమే. ఈ ఆధునిక సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇది కచ్చితంగా ఆనందపడాల్సిన విష‍యం. కానీ సరిగ్గా ఇక్కడే ఒక పెను సమస్య మొత్తం భారతీయ కుటుంబ వ్యవస్థనే నామరూపాలు లేకుండా కబలించేందుకు సిద్ధమైంది. ఎంత సమానమైనా ఆడ, మగ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని తేడాలు ఉంటాయి. అలాగే మన సంస్కృతి ఆడకు, మగకు కొన్ని బాధ్యతలను, పరిమితులను నిర్దేశించింది. ఆ సన్నని గీతను ఇటు ఆడవాళ్లు అటు మగవాళ్లు చెరిపేస్తూ మొత్తం మన వివాహ వ్యవస్థకే చేటు తెస్తున్నారు. ఆడవాళ్లు ఆకర్షణీయంగా ఉంటారు. అది ప్రకృతి నిర్దేశించిన నియమం. అందుకే మన సంస్కృతి వస్త్రధారణ విషయంలో కొన్ని పరిమితులను చేసింది. అయితే ఇప్పుడు సమానత్వం పేరుతో మగవాళ్లు ధరించే బట్టలు వేసుకుంటూ, వాళ్లలానే మేం కూడా సిగరెట్లు, మందు తాగుతాం అనే మహిళామణులు పెరిగిపోయారు. వేరే దేశాల్లో అలానే చేస్తున్నారు కదా అంటూ దీనికి సమర్ధింపులు కూడా ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో మీరు ఆడవాళ్లు అన్న విషయం మర్చిపోయి, విచ్చలవిడిగా ఏమైనా స్వేచ్ఛగా చేయొచ్చు అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నారు. కానీ అలా చేసే వ్యక్తులు గౌరవం పొందే అర్హతను కోల్పోతారు. ఆడవాళ్లను గౌరవించడం రాదా? అని ఎవర్నీ ప్రశ్నించే హక్కును వాళ్లు కోల్పోతారు. ఎందుకంటే వాళ్ల గౌరవాన్ని వారే రోడ్డు మీదకు తెచ్చుకున్నప్పుడు ఇక ఆడ, మగ తేగా ఉండదు. స్వేచ్ఛ పేరుతో వారు కోరుకున్నది కూడా అదే కదా? ఆడ, మగ తేడా వద్దని అన్నప్పుడు ఇక ఆడవాళ్ల గౌరవించండి? అని అరవడంలో అర్ధం లేదు.

 

 

ఎవ్కరూ నోరు మెదపరేంటి? వివాహేతర సంబంధం నేరం కాదట..!

 

తాజాగా సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. సెక్షన్ 497 అనే చట్టం మహిళల పట్ల వివక్షాపూరితంగా ఉందని దాన్ని కొట్టి వేసింది. తాజా తీర్పు ప్రకారం సంక్షిప్తంగా, క్షుప్తంగా చెప్పాలంటే వివాహమైన ఒక మహిళ వేరే వ్యక్తితో, అలాగే వివాహమైన ఒక మగవాడు వేరే మహిళతో నిస్సిగ్గుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించవచ్చు. స్త్రీ హక్కులకు భంగం కలుగకూడదని, భార్య అంటే భర్త సొత్తు కాదని భావించిన శ్రీమాన్ సుప్రీంకోర్టు జడ్జిగారు ఈ చారిత్రక తీర్పును చెప్పారు. దీని వలన కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని కానీ విచ్చలవిడితనం పెరిగిపోతుందని కానీ సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుందని కానీ సుప్రీంకోర్టు ఆలోచించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం కోసం మాత్రమే తీర్పును వెలువరించారు. దీని ద్వారా కలిగే పర్యవసానాలు, నష్టాలు గురించి వీసమెత్తు కూడా ఆలోచించలేదు. జీవితాల‌ను ప్ర‌భావితం చేసే ఇలాంటి ముఖ్యమైన తీర్పుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన  మీడియా సంస్థలు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఏదో ఒక పార్టీకి ఊడిగం చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాయి. సెక్షన్ 497 పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ ఎంతగా పతనం అవుతాయో ఒక్క క్షణం ఆలోచించండి. ఇది సమానత్వం పేరిట స్త్రీ, పురుషుల మధ్య అగాధాన్ని సృష్టించేదిగా ఉంది కానీ మరేదీ కాదు. దీని వలన వివాహ వ్యవస్థ పతనం కావడం తథ్యం. కానీ దీనిపై ఇంతవరకూ అర్ధవంతమైన చర్చ జరిగిన దాఖలాలు లేవు. ఒకవైపు ట్రిపుల్ తలాక్ తప్పు అని చెపుతున్న సుప్రీంకోర్టే మరోవైపు వివాహేతర సంబంధం తప్పు కాదని చెపుతోంది. ఈ రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసం అర్ధం కాక సామాన్య ప్రజలు ఆందోళన చెందుతుంటే , తప్పుడు మార్గంలో విచ్చలవిడిగా తిరిగే వాళ్లు ఆనందపడుతున్నారు.

 

 

ఈ తీర్పుల అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం!

 

ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను నిశితంగా గమనిస్తే… అసలు ఈ దేశానికి ఏమైంది? అని అనిపించకమానదు. అభివృద్ధి చెందిన దేశాలే అనుమతించేందుకు భయపడుతున్న స్వలింగ సంపర్కాన్ని మన దేశంలో అనుమతించారు. ప్రకృతికి విరుద్ధంగా జరిపే ఆ విచ్చలవిడి చర్యను అనుమతించడం వలన జరిగే పర్యవసానాలు, నేరాలను కోర్టు అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం స్వలింగ సంపర్కులకు స్వేచ్ఛ కల్పించారు. అలాగే శబరిమలలో అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని కూడా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. సాధారణంగా రుతు క్రమం సమయంలో హిందూ ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించరు. దీనిపై ఎవరికి వారు స్వీయ నియంత్రణ విధించుకుంటారు. కాబట్టి అన్ని హిందూ ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తారు. కానీ శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మాత్రం యుక్త వయస్సులో ఉన్న మహిళలకు ప్రవేశం లేదు. అది అక్కడ నమ్మకాలకు, ఆచారాలకు సంబంధించిన విషయం. కానీ సుప్రీంకోర్టు  మహిళలకు ప్రవేశం కల్పించాలని తీర్పునిచ్చింది. మహిళల రుతు క్రమం అందులో ఉన్న ఇబ్బందులు, ఆలయం, మూల విరాట్టు విశిష్టత ఇత్యాది విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచో ఈ ఆచారం అక్కడ ఉంది. ఇప్పుడు సమానత్వం పేరిట కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం విశిష్ఠత, ఆచారాన్ని మంటకలిసినా ఫర్వాలేదంటూ సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడం బాధాక‌ర‌మ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

 

 

ఆనందాన్ని ఎవరు కోరుకోరు…కానీ ఎంత మూల్యానికి..?

 

గడిచిన పదేళ్లుగా సామాజిక విప్లవం ఊపందుకుంది. సామాజిక మాధ్యమాలు, మీడియా, టెక్నాలజీ మనుష్యుల జీవితాలను సమూలంగా మార్చివేసాయి. బాధ్యతలు, హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ ల మధ్య ఒక గట్టి సంఘర్షణ చోటుచేసుకుంది. ముఖ్యంగా స్వేచ్ఛను, సమానత్వాన్ని మహిళలు కోరుకుంటున్నారు. ఇది కచ్చితంగా అభినందించాల్సిన విషయమే. కానీ ఇక్కడే ఒక సరిదిద్దుకోలేని తప్పు జరుగుతోంది. స్వేచ్ఛ , సమానత్వం, హక్కుల కోసం పోరాటం చేస్తున్న మహిళలు బాధ్యతలు, విలువలను గాలికి వదిలేస్తున్నారు. దీంతో సమాజంలో, కుటుంబంలో, మొత్తం భారతీయ కుటుంబ వ్యవస్థలోనే పెద్ద అగాధం ఏర్పడుతోంది. స్త్రీ వాదం పేరుతో మేం మగవాళ్లతో సమానం అంటూ ఒక అసంబద్ధ వాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. ఎన్ని చెప్పుకున్నా స్త్రీ వేరు..పురుషుడు వేరు. వీరిద్ధరు శరీర ధర్మాలు వేరు. కొన్ని విషయాల్లో ఒకరు చేసే పనులు ఇంకొకరు చేయలేరు. ఇద్దరూ సమానమే అందులో సందేహం లేదు. పరస్పరం గౌరవించుకోవడం అన్నది ముఖ్యం. అది చేయకుండా కేవలం ద్వేషం పెంచుకోవడం మగవాళ్లు బట్టలు వేసుకుంటాం. వాళ్లలా చెడు అలవాట్లు నేర్చుకుంటాం అంటే స్త్రీ గౌరవం కోల్పోతుంది. వీటన్నింటికి ప్రధాన కారణం సోషల్ మీడియా. ఒక నియంత్రణ, బాధ్యత లేకుండా విచ్చలవిడి అభిప్రాయాలు వెలిబుచ్చడం, కుటుంబ పరువును గాలికొదిలి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం పెరిగిపోయింది. తాజాగా జరిగిన ప్రణయ్, అమృతల ఉదంతంలో అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్ ను దారుణంగా చంపించడం ఈ కోణంలోంచే చూడాల్సి వస్తుంది. ఒక మనిషిని హత్య చేయడాన్ని ఎవరూ సమర్థించకపోయినా వయస్సుకు వచ్చిన కూతురు భాద్యత మరిచి ప్రవర్తించడం,సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టడం, అలాగే సామాజిక ఒత్తిడి మారుతీరావును ఈ దారుణానికి ఉసికోల్పాయి. సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చినా అందరూ, ముఖ్యంగా మహిళలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గుప్పెట మూసి ఉన్నంత వరకే దానికి విలువ. దాన్ని తెరిచి చూపిస్తే విలువ ఉండదు. పురాతన కాలం నుంచి మన సంస్కృతిలో మహహిళలకు ఒక గౌరవం ఉంది. సమానత్వం పేరుతో దాన్ని వలువులతో పాటు విలువలను విప్పి చూపిస్తే వాళ్లకు గౌరవం ఉండదు. వాళ్లపై దాడులు పెరుగుతాయి. అత్యాచారాలు పెరుగుతాయి. సమాజంలో అశాంతి నెలకొంటుంది. ఆడదాన్ని ఎలా అయినా చూడాలన్న పరిపక్వత మన సమాజంలో ఇంకా రాలేదు. అది గమనించుకోవాలి. మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. విచ్చలవిడిగా తిరిగే అమ్మాయి, అబ్బాయి…ఆంటీ, అంకుల్…తప్పుడు సంబంధాలు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. చెడు తిరుగుళ్లకు తప్పదు భారీ మూల్యం. అది మన దేశ భవిష్యత్ నే దెబ్బతీసి ఈ దేశానికి ఏమైంది? అన్న స్థితికి తీసుకురావద్దు. ఇది అందరి బాధ్యత.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

 

 

ఆ కీలక ‘మలుపు’ మీ జీవితాన్ని మార్చేస్తుంది!!

 

ఒక మ‌నిషి త‌న‌ వ్యక్తిగ‌త జీవితంలో కానీ అటు వృత్తి వ్యాపారాల్లో ఉన్న‌తంగా రాణించాలంటే క‌ష్టించే ల‌క్ష‌ణం ఉండాలి. క‌ష్టం, నేర్చుకోవాల‌న్న త‌ప‌న‌, నేర్చుకున్న దాన్ని ఆచ‌రించే నేర్పు మాత్ర‌మే విజ‌యవంత‌మైన మ‌నుష్యుల‌ను త‌యారు చేస్తాయి. కానీ కేవ‌లం క‌ష్ట‌ప‌డితే స‌రిపోదు.. దాన్ని ఎంత‌వ‌ర‌కూ కొన‌సాగించాలి అన్న అతి ముఖ్య‌మైన విష‌యం కూడా తెలిసి ఉండాలి. చాలా మంది క‌ష్ట‌ప‌డ‌తారు కానీ అస‌లైన ఫ‌లితం వ‌చ్చే కీల‌క స‌మ‌యంలో విర‌మించుకుంటారు. దీని వ‌ల‌న విజ‌యానికి దూర‌మ‌వుతారు. మ‌నం నీటిని 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వ‌ర‌కూ మ‌రిగిస్తే కానీ అది ఆవిర‌య్యే స్థితికి రాదు. అంటే మార్పు అనేది 100 డిగ్రీల వ‌ద్ద సంభ‌వించింది. 100 డిగ్రీల వ‌ద్దే నీరు ఆవిర‌య్యే స్థితికి చేరుకుంది కాబ‌ట్టి మిగిలిన 99 డిగ్రీల పాటు ఖ‌ర్చు చేసిన శ్ర‌మ అంతా వృధా అని కాదు. అంత‌వ‌ర‌కూ ఆ కృషిని ఒకే విధమైన‌ తీవ్ర‌త‌తో కొన‌సాగించ‌బ‌ట్టే 100 డిగ్రీల స్థాయికి చేరుకుని అనుకున్న ఫ‌లితం వ‌చ్చింది. అలాగే వ్యాపారంలో కానీ కెరీర్ లో కానీ అనుకున్న ఫ‌లితం రావాలంటే క‌ష్ట‌ప‌డ‌టాన్ని కొన‌సాగించాలి. కొద్ది రోజులు ప్ర‌య‌త్నం చేసి మ‌న వ‌ల్ల కావ‌డం లేదు, మంచి ఫ‌లితాలు, లాభాలు రావ‌డం లేద‌నుకుని ప్ర‌య‌త్నాన్ని నిలిపేస్తే కీల‌క‌మైన మార్పును చూసే స‌ద‌వకాశాన్ని కాల‌ద‌న్నుకున్న‌ట్టవుతుంది.

 

 

 

ఒక కీల‌క ఆవిష్కర‌ణ‌ను కొన‌సాగించ‌డ‌మే అభివృద్ధి!

 

మానవ ప‌రిణామ క్ర‌మాన్ని తీసుకుంటే అప్ప‌టివ‌ర‌కూ లేని ఒక ఆవిష్క‌ర‌ణను చేసి దాన్ని అదే తీవ్ర‌త‌తో కొన‌సాగించుకుంటూ వెళ్ల‌డం. ఈ అంశ‌మే సృష్టిలో మాన‌వున్ని తెలివైన జీవిగా నిల‌బెట్టింది. రాతి యుగం నుంచి ఇప్ప‌టి ఆధునిక యుగం వ‌ర‌కూ మ‌నం ఇంత‌టి అభివృద్ధి సాధించామంటే దానికి కార‌ణం ఈ ల‌క్ష‌ణ‌మే. గ్రాహంబెల్ టెలిఫోన్ క‌నిపెట్టాడ‌ని ఆ ఆవిష్క‌ర‌ణ అక్క‌డితో ఆగిపోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే ఆవిష్క‌ర‌ణ‌కు మార్పులు చేస్తూ అదే తీవ్ర‌త‌తో సెల్ ఫోన్, పేజ‌ర్, స్మార్ట్ ఫోన్ ఇలా మ‌నిషి స‌మాచార ఆవిష్క‌ర‌ణలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఒక కొత్త విష‌యాన్ని పునాదిగా చేసుకుని దానిపై కొంగొత్త మార్పును నిర్మించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇన్ని స‌దుపాయాల‌తో స్మార్ట్ ఫోన్ ఉంద‌ని, గ్రాహంబెల్ టెలిఫోన్ ను త‌క్కువ చేయ‌డానికి వీలులేదు. స్మార్ట్ ఫోన్ ఆవిష్క‌ర‌ణకు మూలం టెలిఫోన్. క‌ష్టం అనే ముడి స‌రుకును ఉప‌యోగించి కీల‌క ద‌శ‌కు చేరుకునేందుకు నిరంత‌రం కృషి చేయ‌డమే అభివృద్ధి అంటే.

 

 

 

మార్పు సంభ‌వించే వ‌ర‌కూ నువ్వు బ‌రిలో ఉన్నావా?

 

అంద‌రికీ వ‌ర్తించే ఒక సాధార‌ణ ఉదాహ‌ర‌ణ‌ను తీసుకుంటే ..మ‌నలో చాలా మంది జిమ్ కు వెళుతూ ఉంటాం. కానీ కొంద‌రే జిమ్ కు వెళ్లే అల‌వాటును కొన‌సాగిస్తారు. అందులో కూడా కొంద‌రికే అనుకున్న‌ ఫ‌లితాలు వ‌స్తాయి. ఎందుకు? ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఫిట్ నెస్ ల‌క్ష్యాన్ని కొన‌సాగించ‌డం ఒక ఎత్తైతే, కీల‌క‌మైన, మార్పు సంభ‌వించే స‌మ‌యంలో క‌ష్టాన్ని ఓర్చుకోవ‌డం మ‌రో ఎత్తు. మ‌నం ఏదైనా ఒక శారీర‌క వ్యాయామం చేస్తున్న‌ప్పుడు చివ‌రి 30 సెక‌న్ల‌లో ఓర్చుకోలేని క‌ష్టం, శ్ర‌మ ఉంటాయి. దాన్ని త‌ట్టుకుని ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డ‌మే విజ‌యం. అలా త‌ట్టుకున్న వాళ్లే మంచి ఆరోగ్యాన్ని , శ‌రీరాకృతిని సొంతం చేసుకుంటారు. మొద‌టి రెండు నిమిషాలు బాగా వ్యాయామం చేసి మార్పు సంభ‌వించే చివ‌రి 30 సెక‌న్ల‌లో క‌ష్టాన్ని త‌ట్టుకోలేక దాన్ని మ‌ధ్య‌లో వ‌దిలిపెట్టే వాళ్లే ఎక్కువ‌. అందుకే ఫిట్ నెస్ విజేత‌లు చాలా త‌క్కువ మంది ఉంటారు. ఈ ఉదాహ‌ర‌ణ‌ను మ‌నం జీవితంలో అన్ని విష‌యాల‌కు అన్వ‌యించుకోవ‌చ్చు. వృత్తి , వ్యాపారం, వ్య‌క్తిగ‌త ఎదుగుద‌ల ఇలా దేనికైనా అన్వ‌యించుకోవ‌చ్చు. ఒక విష‌యం కోసం, ఒక ప‌ని కోసం, ఒక ల‌క్ష్యం కోసం ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌డు మొద‌టి నుంచి ఒకే తీవ్ర‌త‌తో ప‌నిచేస్తూ మార్పు సంభ‌వించే కీల‌క‌మైన స‌మ‌యంలోనూ దాన్ని ప‌ట్టువిడ‌వ‌కుండా కొన‌సాగించ‌గ‌ల‌గాలి. అప్పుడే విజేత‌గా మారేందుకు వీలుంటుంది.

 

 

కీల‌క‌మైన మార్పుకు ఒక్కసారిగా చేరుకోవాలంటే సాధ్యం కాదు!

 

చాలా మంది యువకులు, ఔత్సాహికులు ఇప్పుడు వ్యాపారంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇది మంచి పరిణామమే. అయితే ఓపిక, కష్టాన్ని ఎంత వరకూ కొనసాగించాలన్న కీలకమైన దశలో వాళ్లు విఫలమవుతున్నారు. వ్యాపారంలో రాణించాలంటే కష్టపడటం ఒక్కటే సరిపోదు. దాన్ని ఎంతకాలం కొనసాగించాలి? ఏ స్థితిలో ఫలితాలు రాబట్టుకుంటాయ్ అన్నదానిపై వాస్తవ సదృశ్యమైన అవగాహన ఉండాలి. వ్యాపారం మొదలుపెట్టిన వెంటనే మొదటి ఎటువంటి లాభం రాలేదు అనుకుందాం. ఇటువంటి సందర్భంలో చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే పని చేసా కానీ ఫలితం రాలేదు అనుకుంటారు. అలాగే నేను సమయం వృధా చేసాను. నేను సరిగా వ్యాపారం చేయలేదు..ఇలాంటి ఆలోచనలతో మధన పడుతూ ఉంటారు. అది చాలా తప్పు ఆలోచన. నువ్వు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు వెంటనే అనుకున్న ఫలితాలు రావు. కష్టాన్ని కొనసాగించినప్పుడు ఒక స్థాయి దగ్గర ఫలితాలు రావడం మొదలుపెడతాయి. అంతకు ముందు చేసిన కష్టం వల్లనే అది సాధ్యమైంది. అంత వరకూ ఓపిగ్గా, ఒక వ్యూహంతో ఉండటమే విజయం. ప్రకృతి కూడా మనకు వేచి ఉండి సాధించాలన్న సూత్రాన్ని నిర్దేశించింది. మనిషి తన భాగస్వామితో భావోద్రేకం చెంది శృంగారం చేయాలన్నా..అందులోని ఆనందాన్ని అనుభవించాలన్నా..చివరి స్థాయి వరకూ వేచి ఉండాల్సిందే. వేచి చూస్తున్నావా? కష్టపడుతున్నావా? అన్న విషయాలే చివరకు నీ విజయాన్ని నిర్దేశిస్తాయి.

 

 

గెలుపుకు, ఓటమికి మధ్య తేడా కొన్ని సెకన్లు మాత్రమే!

 

మనందరికీ జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కోసం తెలుసు. పరుగు పందెంలో ఎన్నో ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్న ఉసేన్ 100 మీటర్ల పరుగులో తన ప్రత్యర్ధుల కంటే కేవలం ఒకట్రెండు సెకన్ల ముందుంటాడు. కేవలం ఒకటి రెండు సెకన్లు మాత్రమే విజేతలను నిర్ణయిస్తాయి. చివరి స్థాయిలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారన్నదే ఇక్కడ కీలకం. పరీక్షలు, వ్యాపారం ఏదైనా బాగా కష్టపడి ఒక కీలకమైన మలుపు వరకు వేచి చూసినప్పుడే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు వచ్చే ముందు తలెత్తే సమస్యలు ఎదుర్కొని ధైర్యంగా ఎవరు వేచి చూస్తారో వారే విజేత. మార్పు అనేది సహజం. అది సంభవించేందుకు కొంత సమయం పడుతుంది. విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న చివరి నిమిషం వరకూ వేచి చూసి, ఓపిక వహించాలి. పన్నెండేళ్ల పాటు తెలంగాణా ఉద్యమాన్ని కెసీఆర్ మధ్యలో ఎన్నో కష్టాలు వచ్చినా పార్టీని అలా కొనసాగించాడు. చివరికి ఫలితం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఇంకెందుకులే అని నిరాశ చెందితే అత్యున్నత స్థాయికి ఎప్పటికీ చేరుకోలేం. కష్టపడు..ఓర్చుకో..కీలకమైన మలుపు దగ్గర మరింతగా శ్రమించు..విజయం నీ మీ వెంటే ఉంటుంది.

 

 

( ఈ ఆర్టికల్ మీకు స్పాన్సర్ చేసిన వారు) 

 

 

అక్టోబ‌ర్ 2 న‌ ప్ర‌తిష్టాత్మ‌క టీచింగ్ అవార్డుల కార్య‌క్ర‌మం ITAP-2018

 

 

 

  • ఉత్త‌మ ఉపాధ్యాయుల‌కు అద్భుత అవ‌కాశం
  • నామినేష‌న్ల ప్ర‌క్రియ జ‌రుగుతోంది
  • దేశంలోనే అత్యుత్త‌మ టీచ‌ర్స్ అవార్డుల కార్య‌క్ర‌మం
  • బెస్ట్ టీచ‌ర్స్ ను ఒక‌చోట క‌లిపే అద్భుత వేదిక
  • 7 స్టార్ హోట‌ల్ లో రాజ‌కీయ‌, సినీ, పారిశ్రామిక‌ ప్ర‌ముఖల‌తో అవార్డుల ప్ర‌ధానం

 

ఉపాధ్యాయుడు ఒక విద్యార్ధి భ‌విష్య‌త్ ను తీర్చిదిద్దే మార్గ‌ద‌ర్శ‌కుడు. ఒక మ‌నిషి త‌ల్లిదండ్రుల త‌ర్వాత పూజించాల్సింది గురువునే. జీవితాంతం సేవ చేసుకున్నా మ‌నం మ‌న గురువు రుణం తీర్చుకోలేము. ప్ర‌త్య‌క్ష దైవం లాంటి గురువును గౌర‌వించుకునే, గుర్తుచేసుకునే సంప్ర‌దాయం మెల్ల‌గా క‌నుమ‌రుగవుతోంది. కార‌ణాలు ఏమైతే కానీ గురువుకు గుర్తింపు ఉండ‌టం లేదు..గౌర‌వం ఉండ‌టం లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో గురువు యొక్క గొప్ప‌త‌నాన్ని నేటి త‌రానికి చాటిచెప్పి, అత‌న్ని గౌర‌వించుకునే స‌త్సాంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టింది. రాజా ర‌త్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్ట్. ఐడియల్ టీచింగ్ అవార్డ్ ప్రొగ్రామ్ పేరిట ప్ర‌తీ ఏటా మంచి ప‌నితీరు క‌న‌బ‌ర్చిన టీచ‌ర్ల‌ను అవార్డుల‌తో స‌త్క‌రిస్తోంది. రాజా ర‌త్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్ట్ చేస్తున్న ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని చూసి ట్యూట‌ర్ ప్రైడ్ సంస్థ ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

 

 

 

 

ఈ ఏడాదికి గాను అక్టోబ‌ర్ 2 న‌ ఈ అవార్డుల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. దేశంలోనే తొలిసారిగా టీచ‌ర్స్ కోసం ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తీ టీచ‌ర్ పాల్గొనాల్సిందిగా అవార్డు నిర్వాహ‌కులు కోరుతున్నారు. ఒక్క అక‌డ‌మిక్ టీచ‌ర్స్ మాత్ర‌మే కాకుండా నాన్ అక‌డ‌మిక్ టీచ‌ర్స్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి టీచ‌ర్స్ ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్నారు. ఫ్రొఫెస‌ర్స్ ద‌గ్గ‌ర్నుంచి డీన్ లు, ప్రిన్సిప‌ల్స్ , యోగా టీచ‌ర్స్ , అక‌డ‌మిక్ టీచ‌ర్స , లెక్చ‌ర‌ర్స్ ఇలా అన్ని విభాగాల నుంచి టీచ‌ర్స్ ఇందులో పాల్గొంటారు. ఆలోచ‌న‌ల‌ను క‌ల‌బోసుకునేందుకు, అభిప్రాయాల‌ను పంచుకునేందుకు అదే స‌మ‌యంలో మీ ప్ర‌తిభను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే ఒక ప్రతిష్ఠాత్మ‌క అవార్డును అందుకునేందుకు ఇదో అద్భుత అవకాశం. ఇప్పుడే నామినేష‌న్ వేయండి.

 

ఇప్ప‌డే సంప్ర‌దించండి.

 

Website :  www.itapawards.com

Email  :  itapawards@gmail.com

Mobile : +91-7396583407 , 8247367450

 

అవార్డుల జ్యూరీ

 

 

 

అవార్డుల కార్య‌క్ర‌మం షెడ్యూల్

 

       

 

 

వేదిక

ట్రైడెంట్ హోట‌ల్, మాదాపూర్, హైద‌రాబాద్ 

 

 

 

 

 

ఈ ప్రతిష్టాత్మ‌క ఈవెంట్ లో పాల్గొన‌డం వ‌ల‌న ప్ర‌యోజ‌నాలు

 

1. దేశంలోనే అత్యుత్త‌మ అవార్డును సాధించే వీలు.
2. తెలుగు మీడియాతో పాటు నేష‌న‌ల్ మీడియా క‌వ‌రేజీ
3. మీ రంగాల్లో ఉన్న ఇత‌ర ఉపాధ్యాయుల‌ను, ప్ర‌ముఖుల‌ను క‌లుసుకునే అవ‌కాశం
4. మీ ప్ర‌తిభ‌ను వెల్ల‌డి చేస్తూ, మీ సేవ‌ల‌ను గుర్తింపు
5. మీ వంటి అభిరుచులు ఉన్న వ్య‌క్తుల‌ను క‌లుసుకోవ‌డం
6. అన్నింటికంటే ముఖ్యంగా ఎంద‌రో ప్ర‌ముఖుల సమ‌క్షంలో అవార్డును అందుకునే ఒక మ‌ధుర జ్ఞాప‌కం

 

Ticket Pricing

 

 

పాస్ ల కోసం ఈ క్రింది వెబ్ లింక్ ల‌ను క్లిక్ చేయండి.

 

www.itapawards.com

https://www.meraevents.com/event/itapawards

 

(Please note that all payments are processed, and pass is non-refundable. It is advised to books the tickets at the earliest.)

మీరు “ది బెస్ట్” అవునో, కాదో తెలుసుకోవాలంటే ఇది చదవండి!!

 

 

బీ ద బెస్ట్..ఇది విన‌డానికి చిన్న ప‌ద‌మే కావొచ్చు. కానీ దీన్ని అందుకోవాల‌న్నా..దీన్ని సాధించాల‌న్నా ఎంతో కృషి , ప‌ట్టుదల కావాల్సి ఉంటుంది. అన్నింట్లోనూ అత్యుత్తంగా ఉండాలంటే మ‌నం చేసే ప‌నులు, మ‌న ప్ర‌వ‌ర్త‌న‌, మ‌న న‌డ‌వ‌డిక ఇలా అన్నీ ఎంతో బాధ్య‌త‌, నాణ్య‌త‌తో కూడి ఉండాలి. వీట‌న్నింటికి తోడు నిజాయితీ ఉండాలి. చేసే ప‌నిలో నిజాయితీ ఉంటే దాని నుంచి వ‌చ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒక విద్యార్ధి అయినా, ఉద్యోగి అయినా లేదా వ్యాపార‌వేత్త అయినా ద బెస్ట్ గా ఎదాగ‌లంటే ఎన్నో ల‌క్ష‌ణాల‌ను, అర్హ‌త‌ల‌ను స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ గా ఎదగాలంటే ముందుగా మీరు ఎదుటివారికి ద బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. మీ కుటుంబ స‌భ్యులు, మీ సహోద్యోగులు, మీ కింద ప‌నిచేసే వారు, మీరు ప‌నిచేస్తున్న సంస్థ‌, మీ తోటివారు ఇలా ఎవ‌రికైనా అత్యుత్త‌మైన‌ది ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు మాత్ర‌మే మీరు బెస్ట్ గా ఎదుగుతారు.

 

 

బాధ్య‌త అంటే అత్యుత్త‌మ‌మైన‌ది అందించ‌డ‌మే!!

 

ఒక తండ్రి త‌న పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ ను అందించాలంటే వాళ్ల‌కు అత్యుత్త‌మైన స‌దుపాయాలు క‌ల్పించాలి. మంచి స్కూల్, మంచి పెంప‌కం, మంచి తిండి, మంచి ప్ర‌వ‌ర్త‌న అందించ‌గ‌లిగితే వారు ది బెస్ట్ పౌరులుగా ఎదుగుతారు. కెరీర్ ప‌రంగా, ప్ర‌వ‌ర్త‌న ప‌రంగా, సామాజిక ప‌రంగా అత్యున్న‌తమైన వ్య‌క్తులుగా త‌యార‌వుతారు. ఇక్క‌డ ఇంకో అద్భుత‌మైన విష‌యం దాగుంది. తండ్రి త‌న పిల్ల‌ల‌కు ది బెస్ట్ పెంప‌కం అందించిన‌ప్పుడు దాన్ని అందిపుచ్చుకుని వాళ్లు మంచి పౌరులుగా ఎదిగిన‌ప్పుడు వారు కూడా వాళ్ల పిల్ల‌ల‌తో పాటు స‌మాజానికి అదే విధ‌మైన విలువ‌లు, బాధ్య‌త అందిస్తారు. ఒక ప‌ని చేసినప్పుడు విలువ‌లు, నాణ్య‌త‌, నిజాయితీతో కూడిన ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తారు. దీని వ‌ల‌న వారు ఎవ‌రికి మేలు చేసినా అది అత్యుత్త‌మంగా, మంచిదిగా ఉంటుంది. దాని వ‌ల‌న అవ‌త‌లి వ్యక్తుల‌కు మేలు జ‌ర‌గ‌డ‌మే కాకుండా వీరు కూడా త‌మ అత్యుత్త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో స‌మాజంలో , త‌మ వ్యాపారంలో, ఉద్యోగ జీవితంలో ఉన్న‌తంగా ఎదుగుతారు.

 

 

ఇవ్వ‌డం నేర్చుకుంటే నీకు అన్నీ వ‌స్తూనే ఉంటాయ్!!

 

ఇప్పుడు మ‌న స‌మాజంలో చాలా మందికి ఇవ్వ‌డం అనేది అస్స‌లు తెలీడం లేదు. నేను క‌ష్ట‌ప‌డి సంపాదించాను నేను ఎందుకు ఇవ్వాలి? నేనెందుకు స‌హాయ చేయాలి? అన్న ధోర‌ణి మ‌నుష్యుల్లో పెరిగిపోతోంది. ఇది చాలా త‌ప్పు. మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాంట్లో మ‌న సంక్షేమానికి త‌గిన మొత్తాన్ని అట్టిపెట్టుకున్న త‌ర్వాత మిగిలిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆప‌ద‌లో, అవ‌స‌రంలో ఉన్న‌వారికి ఇవ్వ‌గ‌లిగితే మ‌న వ్య‌క్తిత్వ నిర్మాణంలో ఎంతో మార్పు వ‌స్తుంది. ఎందుకంటే ఇలా ఆప‌ద‌లో ఉన్న మీ పొరుగువారికో, మీ సహోద్యోగికో, మీ కింద ప‌నిచేసే వారికో మీకు చేత‌నైనంత స‌హాయం చేస్తే అది ఎంతో ఆత్మ సంతృప్తిని అందిస్తుంది. ఇలా ఇవ్వ‌డం వ‌ల‌న మీకు వ‌స్తూనే ఉంటుంది అన్న విష‌యాన్ని ఎప్పుడూ మ‌ర్చిపోకండి. ఎందుకంటే ఒక మంచి స‌దుద్దేశ్యంతో, నిజాయితీగా, మ‌న‌స్ఫూర్తిగా మీరు స‌హాయం చేసిన‌ప్పుడు ప్ర‌కృతి మీకు అంత‌కు రెట్టింపు సంప‌ద‌ను అందిస్తుంది. ఇది సృష్టిలో ఉన్న ఒక అద్భుత‌మైన విష‌యం. కాబ‌ట్టి ఎప్పుడూ మీకు స‌హాయం చేసే శ‌క్తి, అవ‌కాశం ఉన్న‌ప్పుడు క‌చ్చితంగా ఇత‌రుల‌కు స‌హాయం చేయండి. ఒక‌సారి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు అర్జెంట్ 20 ల‌క్ష‌ల అవ‌సరం పడింది. ఎంత సూప‌ర్ స్టార్ అయినా స‌మ‌యానికి డ‌బ్బులు లేక‌పోతే ఎవ‌రినో ఒక‌రిని స‌హాయం కోరాల్సిందే. బ్యాంకు ఖాతాలు, ఇంట్లో ఉన్న బీరువాలు అన్నీ గాలిస్తే 16 ల‌క్ష‌లు స‌మ‌కూరాయి. ఇంకో 4 ల‌క్ష‌లు కావాల్సి ఉంది. స్నేహితుల‌కు ఫోన్ చేస్తే ఒకట్రెండు రోజులు స‌మ‌యం ఇస్తే నాలుగు ల‌క్ష‌లు స‌మ‌కూరుస్తామ‌ని చెప్పారు. ఇంత‌లో ర‌జ‌నీ చిన్న‌నాటి స్నేహితుడు అత‌ని ఇంటికి వ‌చ్చాడు. మా అమ్మాయి పెళ్లి రెండురోజుల్లో ఉంది. ఒక ల‌క్ష రూపాయ‌లు అవ‌స‌రం ప‌డింది. ఎలాగైనా నువ్వే స‌ర్దాలి అని ర‌జ‌నీని అడిగాడు. రజ‌నీకాంత్ వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న 16 ల‌క్ష‌ల్లో ఒక ల‌క్ష రూపాయ‌ల తీసి త‌న స్నేహితుడికి ఇచ్చి అమ్మాయి పెళ్లి ఘ‌నంగా చేయి అని పంపించాడు. ర‌జ‌నీ చేసిన ప‌నికి అత‌ని భార్య కాస్త నొచ్చుకుంద‌ట‌. మ‌న‌మే ఇప్పుడు డ‌బ్బు అవ‌స‌రం ప‌డి అంద‌ర్నీ అడిగాం. ఇప్పుడు మీరు ఈ స‌హాయం చేయ‌డం అవ‌స‌ర‌మా? అని అడిగింది. దానికి ర‌జ‌నీ నేను ల‌క్ష రూపాయ‌ల స‌హాయం చేస్తే నా స్నేహితుడు ప‌ని సంపూర్ణంగా పూర్త‌వుతుంది. అత‌ను సంతోషంగా ఉంటాడు. నేను నాలుగు ల‌క్ష‌ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నాను. ఈ క్ష‌ణం నుంచి 5 ల‌క్ష‌ల కోసం ప్ర‌య‌త్నిస్తాను. పెద్ద తేడా లేదు. కాబ‌ట్టి స‌హాయం చేయ‌డంలో నాకు వెసులుబాటు ఉంది అందుకే చేసాను అని చెప్పాడు. ఇటువంటి వ్య‌క్తిత్వ నిర్మాణం చేసుకున్నాడు క‌నుక‌నే అత‌ను నిజ‌జీవితంలోనూ సూప‌ర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు మ‌న స‌మాజానికి అలాంటి సూప‌ర్ స్టార్ లు కావాలి.

 

 

చేస్తున్న ప‌నిలో నాణ్య‌త, నిజాయితీ ఉండాలి!

 

మీరు ఒక కంపెనీలో ప‌నిచేస్తున్నారు. ప‌ర్య‌వేక్ష‌ణ లేన‌ప్పుడు ప‌నిచేయ‌కుండా త‌ప్పించుకోవ‌డం, ఏదో చేస్తున్నాం లే అన్న ధోర‌ణిలో ఉండ‌టం వంటివి అస్స‌లు చేయ‌కండి. ఎందుకంటే ఇటువంటి వైఖ‌రి మీ కెరీర్ ను దారుణంగా దెబ్బ‌తీస్తుంది. ఎందుకంటే చేస్తున్న ప‌నిలో నాణ్య‌త, నిబ‌ద్ధ‌త లేక‌పోతే ఆ కంపెనీ వ‌దిలి వేరే కంపెనీకి వెళ్లిన‌ప్పుడు మీ ప‌నితీరు దారుణంగా దెబ్బ‌తిని ఉంటుంది. మీరు ప‌నిచేస్తున్న సంస్థ‌, లేదా య‌జ‌మాని మీకు న‌చ్చ‌ని విధంగా ఉన్న‌ప్ప‌టికీ మీ ప‌నితీరులో ఎటువంటి తేడా ఉండ‌కూడ‌దు. న‌చ్చ‌ని చోటు నుంచి వెళ్లిపోవాలి కానీ ప‌ని చేయ‌డం మానేయ‌డం, నిజాయితీగా లేక‌పోవ‌డం వంటి చేస్తే అది మీ వ్య‌క్తిత్వాన్ని, మీ ఉద్యోగ జీవితాన్ని దెబ్బ‌తీస్తుంది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్లు తమ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న వాళ్లు విష‌యంలో నిజాయితీగా ఉండాలి. వారికి ఎటువంటి ఆప‌ద వ‌చ్చినా ఆదుకునేందుకు రెడీగా ఉండాలి. అలాగే నిబ‌ద్ధ‌త‌, ప‌నితీరు న‌చ్చ‌ని ఉద్యోగుల‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. వాళ్ల‌ను త‌క్ష‌ణ‌మే వ‌దిలించుకోండి. బెస్ట్ ఇవ్వ‌డానికి ట్రై చేస్తే మీకు ఎప్పుడూ బెస్ట్ ఇవ్వ‌డానికి దేవుడు ట్రై చేస్తూ ఉంటాడు. కాబ‌ట్టి ఉద్యోగ జీవితంలో అయినా వ్యాపారంలో అయినా ఎప్పుడూ చేస్తున్న ప‌నిలో నిజాయితీ, నిబ‌ద్ధ‌త చూపిస్తూ, ఆప‌ద‌లో ఉన్నవారిని ఆదుకునేందుకు మీ ప‌రిధి మేర‌కు ప్ర‌య‌త్నం చేస్తే వ్య‌క్తిగా మంచి స్థితికి చేరుకుంటారు. మంచి చేయ‌కున్నా ఫ‌ర్వాలేదు ఎవ‌రికైనా చెడు చేయాల‌న్న తలంపు వ‌స్తే అది గోడ‌కు కొట్టి బంతిలా రెట్టింపు వేగంతో మీ వైపుకు వ‌స్తుంది. మీకే చెడు జ‌రుగుతుంది. అటువంటి ప్ర‌తికూల త‌పంపులు ఎప్పుడూ మ‌న‌కు మేలు చేయ‌వు.

 

 

విత్త‌నం నాటిన వెంట‌నే ఫ‌లాలు రావు!!

 

పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు వేట‌కు వెళ్లి బాగా అలిసిపోయి దాహంతో నీళ్ల కోసం అన్వేషిస్తున్నారు. చాలా సేపు తిరిగిన త‌ర్వాత ఒక బాట ప‌క్క‌న మామిడి టెంక‌లు నాటుతున్న వృద్ధుడు క‌నిపించాడు. రాజును చూసిన వెంట‌నే వృద్ధుడు అత‌ని ఒక చెట్టు కింద‌కు తీసుకెళ్లి దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగాక కాస్త స్థిమిత‌ప‌డ్డ రాజు ఏమ‌య్యా పెద్దాయ‌న బాట ప‌క్క‌న ఇలా మామిడి టెంక‌లు నాటుతున్నావు.ఎందుకు? అని అడిగాడు. దానికి వృద్ధుడు రాజా మామిడి మొక్క‌లు వ‌స్తాయ‌ని ఈ ప‌ని చేస్తున్నా అని చెప్పాడు. దానికి రాజు న‌వ్వి ఈ మొక్క‌లు పెరిగి చెట్టుగా మారి మామిడి పండ్లు ఇచ్చేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది క‌దా? అప్ప‌టి వ‌ర‌కూ నువ్వు బ‌తుకుదాం అనుకుంటున్నావా? అని అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు వృద్ధుడు కూడా న‌వ్వి రాజా నేను నా కోసం ఈ మొక్క‌లు నాట‌డం లేదు. రేప‌టి త‌రం కోసం నాటుతున్నాను. గ‌తంలో ఎవ‌రో ఇక్క‌డ మొక్క నాటారు కాబట్టే మీరు, నేను ఈ చెట్టు కింద కూర్చుని సేద‌తీరుతున్నాం. నేను కూడా అదే విధంగా రేప‌టి మ‌న పిల్ల‌ల కోసం ఈ ప‌ని చేస్తున్నా అని చెప్పాడు. వృద్ధుని దూర‌దృష్టికి, అత‌ని సేవానిర‌తికి ఆశ్చ‌ర్య‌పోయిన రాజు త‌న రాజ్యంలో మ‌రిన్ని చెట్టు నాటించే కార్య‌క్ర‌మం చేప‌ట్టాడు. ఇప్ప‌డు స్టార్ట‌ప్ లు ప్రారంభిస్తున్న ఔత్సాహికులు ఈ క‌థ నుంచి ఎంతో నేర్చుకోవ‌చ్చు. ఒక సంస్థ ప్రారంభించ‌గానే ఫ‌లితాలు వ‌చ్చేయ‌వు. ఓపిగ్గా వ్య‌వ‌హ‌రించి, నిజాయితీగా, నాణ్య‌త ప్రధాన వ‌న‌రుగా ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ఇవ్వ‌డం నేర్చుకోండి. మీకు వ‌స్తూనే ఉంటుంది. సామ‌ర్ధ్యం మేర‌కు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి ఫ‌లితం ఎలా ఉన్నా దాన్ని తీసుకునే నైపుణ్యాన్ని సాధించాలి. సో..గివ్ ద బెస్ట్ అండ్ యు గెట్ ద బెస్ట్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

జీతాల్లేని ఈ ఫేస్‌బుక్ కూలీలు ఏం చేస్తున్నారో తెలుసా??

 

సోష‌ల్ మీడియా..గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో మాన‌వాళి జీవితాల‌ను విశేషంగా ప్ర‌భావితం చేసిన ఒక సామాజిక విప్ల‌వం. రెండు వైపులా ప‌దునున్న ఈ సామాజిక మాధ్య‌మం అనే క‌త్తితో ప్ర‌జ‌లు కూర‌గాయ‌లు కోసుకోవ‌డం మాని త‌మ గొంతుల‌తో పాటు ప‌క్క‌వాళ్ల గొంతులు కూడా తెగ్గోస్తున్నారు. ప‌క్క ఇంట్లో ఉన్న‌వాడికి కూడా అభినంద‌న‌లో, ఆప్యాయ‌త‌తో, ఆస‌రానో అందిచాల్సిన టైంలో కూడా ఒక మెసెజ్ , ఒక లైక్ ప‌డేసి మానవ సంబంధాల‌ను గొయ్యి తీసి పాతిపెట్టేస్తున్నారు. భావ వ్య‌క్తీక‌ర‌ణ పేరుతో ఫేస్‌‍బుక్ లో, ట్విట్ట‌ర్ లో పెద్ద గొంతు వేసుకుని ప‌డిపోయే న‌యా ఉత్త‌ర కుమారులు బ‌య‌ట‌కు వ‌చ్చి రోడ్డు మీద ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేని ద‌ద్ద‌మ్మ‌లుగా త‌యార‌య్యారు. ఒక మ‌నిషి ఎదురుగుండా మాట్లాడే ధైర్యం లేక‌, ఒక విష‌యం గూర్చి కూలంకుషంగా చ‌ర్చించే విజ్ఞానం లేక కామెంట్ల రూపంలో, పోస్ట్ ల రూపంలో అర‌కొత పైత్యాన్ని, ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కుతూ మాన‌సిక రోగులుగా మారిపోతున్నారు. ప‌రిస్థితి ఇలానే కొనసాగితే మానవ సంబంధాలు దెబ్బ‌తిన‌డంతో పాటు మ‌నుష్యులు మాన‌సికంగా ప‌రిణితి సాధించ‌లేని ఒక దుర్భ‌లురుగా మారిపోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా విసృతి, అది మ‌నుష్యు జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన వైనం, బీట‌లు వారుతున్న బంధాలు, సామాజిక మాధ్యమాల పుణ్యమాని పెరుగుతున్న మాన‌సిక రుగ్మ‌త‌ల‌పై “కెరీర్ టైమ్స్” అందిస్తున్న ప్ర‌త్యేక విశ్లేష‌ణ.

 

 

అస‌లు ల‌క్ష్యం ఎప్పుడో నీరుగారిపోయింది!!

 

బ‌య‌ట స‌మాజంలో ఒక అన్యాయం జ‌రిగింది.. లేదా ఒక అక్ర‌మం జ‌రిగింది.. ఇది బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డానికి మ‌న‌కు ఒక‌ప్పుడు వార్తాప‌త్రిక‌లు, వార్తా ఛానెళ్లు వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియానే దిక్కు. వాళ్లు రిపోర్ట్ చేసింది విని మ‌నం ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఒక అభిప్రాయానికి వ‌చ్చేవాళ్లం. త‌ర్వాత సోష‌ల్ మీడియా రంగ ప్ర‌వేశం చేసింది. ఒక‌ విష‌యం లేదా సంఘ‌ట‌న జ‌రిగిన‌ వెంట‌నే అంద‌రూ త‌మ అభిప్రాయాల‌ను, అనుభ‌వాల‌ను, ప‌రిష్కార మార్గాల‌ను సోష‌ల్ మీడియాలో సూచిస్తారు. దీని వ‌ల‌న స‌మ‌స్య‌కు చాలా వేగంగా ప‌రిష్కారం దొరుకుతుంది. అయితే ఇంత అద్భుత‌మైన వేదిక‌ను విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగిస్తూ, స్వీయ గుర్తింపు కోస‌, విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌నకు వాడుకోవ‌డంతో ఈ వేదిక అస‌లు ల‌క్ష్యం మెల్ల‌గా ప‌క్క‌దారి ప‌ట్టింది. దీంతో అస‌త్యాల‌ను, సొంత అజెండాల‌ను ప్ర‌చారం చేసే కొన్ని మెయిన్ స్ట్రీమ్ వార్తా సంస్థ‌ల‌కు, సోష‌ల్ మీడియా అనేది అనుబంధ సంస్థ‌గా మారిపోయింది. దీంతో సామాజిక మాధ్యమం ఆవిర్భావ ల‌క్ష్యం నీరుగారిపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించ‌కుండా అవ‌స‌రానికి మించి సోష‌ల్ మీడియాలో విహ‌రిస్తూ త‌న తెలివితేట‌లను, త‌న సామాజిక బాధ్య‌త‌ను, త‌న గొప్ప‌తనాన్ని కేవ‌లం త‌న వాల్ మీదే ప్ర‌ద‌ర్శించుకుంటున్నారు.

 

 

స్వీయ గుర్తింపు కోసం పాకులాట త‌ప్ప నిబ‌ద్ధ‌త ఏది??

 

ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ లో రెచ్చిపోయేవాళ్లు, లింక్డ్ ఇన్ లో ఫోటోల‌తో హ‌ల్ చ‌ల్ చేసేవాళ్లు నిజంగా ఒక మ‌నిషి ఎదురుగా నిల్చుని మాట్లాడ‌గ‌ల‌రా? అంటే క‌చ్చితంగా లేరు అనే చెప్పాలి. ఒక నాయకుడి కోసం, అతని అవినీతి కోసం , అతని అసమర్దత కోసం ప్రతీరోజూ ఫేస్‌బుక్ లో పుంఖాపుంఖాలు రాసే మహానుభావులు ఆ నాయకుడి రోడ్డు మీద నడిచిపోతుంతే కనీసం దగ్గరగా వెళ్లేందుకు కూడా ధైర్యం చేయరు. ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం వీళ్లకి లేదు. తమ ఆక్రోషానికి కాస్త పైత్యాన్ని రంగరించి ఫేస్‌బుక్ లో పోస్ట్ లు పెడుతూ పేపర్ పులులుగానే మిగిలిపోతారు. వీళ్లు పెట్టిన పోస్ట్ లకు పదిమంది లైక్ కొడితేనో లేక బాగుంది అని కామెంట్ చేస్తేనో నేను సమాజానికి ఎంతో చేసాను అనుకుంటూ భ్రమల్లో బతికేస్తూ ఒక రకమైన మానసిక ధౌర్బల్యంలోకి జారిపోతున్నారు. వీళ్లకు ఎంతసేపు గుర్తించబడాలనే తాపత్రయం తప్పితే చిత్తశుద్ధితో పనిచేయాలనే విధానం ఉండదు. అవతలి వాడ్ని నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో తిడుతూ ఒక రకమైన చెత్తను పోస్ట్ చేస్తూ దానికి మురిసిపోతూ పైగా తాను నిజమైన సామాజిక సేవకులుగా ఊహించుకుంటారు. వీళ్లలో ఒక్కరూ కూడా బయటకు వచ్చి సమస్యపై స్పందించి దాన్ని క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్న దృష్టిలో ఉండరు. ఒక వ్యక్తికి పెద్ద ఆపద వచ్చింది నాకు ప్రత్యక్షంగా సహాయం చేయండి అని ఫేస్‌బుక్ లో పోస్ట్ వస్తే ఎంతమంది ఆ బాధితుడి ఇంటికి వెళ్లి ఆ ఆపదను తీరుస్తారు. ఒక్కరూ కూడా వెళ్లరు. ఎవరిదైనా పుట్టిన రోజు రాగానే వాట్సాప్ లో మెసెజ్ , ఫేస్‌బుక్ లో ఒక గూగుల్ డస్ట్ ఫోటోను పెట్టి చేతులు దులుపుకునే వారు ఇప్పుడు ఎక్కువైపోయారు. ప్రత్యక్షంగా వెళ్లి అతనికి శుభాకాంక్షలు చెపుదాం. అనుబంధాన్ని, ఆత్మీయతను పెంచుకుందాం అనుకునే వాళ్లు ఎంతమంది?

 

 

ప్రశ్నించే ధైర్యం ఉన్నవాళ్లే విజేతలు!!

 

అణగారిన వర్గాలు, లేదా అణిచివేయబడిన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించాలంటే ప్రశ్నించే ధైర్యం కావాలి. కానీ ఇప్పుడు చాలా మంది కేవలం సామాజిక మాధ్యమాల్లోనే ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి నాయకులను, అధికారులను ప్రశ్నించడం మానేసారు. ఒక నాయకుడ్ని, అధికారిని ప్రత్యక్షంగా కలిసి అతని నిలదీయలేని వారు సమాజాన్ని ఎలా మార్చగలుగుతారు. అలా అని ఒక సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కాదు. అలా పోస్ట్ చేయడం వలన ఆ సమస్య తీవ్రత పదిమందికి తెలుస్తుంది. ఈ పది మందితో ఫేస్‌బుక్ లో చర్చ పెట్టి కామెంట్లు చేసుకుంటూ అభిప్రాయాలను చెప్పుకుంటూ పోతే సమస్యకు పరిష్కారం రాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. అధికారానికి చేరువ కావాలన్నా, సామాజిక మార్పును సాధించాలన్నా ఎవరినైనా ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించుకోవాలి. అలా కాకుండా సామాజిక మాధ్యమాల్లో అవాకులు, చెవాకులు వాగితే ఉపయోగం ఏముంటుంది? ఒక అన్యాయం జరిగినప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించాల్సిందే. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోతే సమస్య ఎక్కడ ఉందో అక్కడకు వెళ్లి దాన్ని పరిష్కరించేది ఎవరు? ఫేస్‌బుక్ పేపర్ పులులు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక విషయంపై ఒక పోస్ట్ పెట్టి తన సామాజిక బాధ్యత అద్భుతం అంటూ తనలో తానే మురిసిపోయి ఒక రకమైన మానసిక రుగ్మతకు లోనవుతున్నారు.

 

 

“గుడ్ మార్నింగ్” , “గుడ్ నైట్” బ్యాచ్ ను వదిలించుకోండి!

 

ఇప్పుడు వాట్సాప్ లో కొత్త రకం వ్యక్తులు తయారయ్యారు. ఉదయం లేవగానే తన ఫోన్ బుక్ లో ఉన్నవారందరికీ ఒక గుడ్ మార్నింగ్ మెసెజ్ పెడతారు. తన పక్కనే ఉన్న తన భార్యకో, తన ఆత్మీయులకో గుడ్ మార్నింగ్ చెప్పరు కానీ ఇలా వాట్సాప్ లలో గుడ్ ‌మార్నింగ్ లు చెపుతారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుతారు. వీళ్లలో ఒక్కరు కూడా తన ఫ్రెండ్ ను ప్రత్యక్షంగా కలిసి విషెస్ చెప్పరు. వాట్సాప్ ఒక మెసెస్ టైప్ చేసి చేతులు దులుపుకుంటారు. కనీసం ఫోన్ చేసి అయినా వాళ్లతో మాట్లాడాలి అన్న ఇంగితం కూడా మర్చిపోయారు. దీనికి తోడు ఒక వాట్సాప్ మెసెజ్ రాగానే వెనుకా ముందా చూడకుండా అందరి ఫ్రెండ్స్ కు ఫార్వార్డ్ చేసేయడం. తాము తమకు తెలియకుండా అబద్ధాలను ప్రచారం చేసే వాహకాలుగా పనిచేస్తున్నామన్న సోయ కూడా ఎప్పుడో మర్చిపోయారు. ఒక మెసెజ్ రాగానే అందులో నిజమెంత? అందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మెసెజ్ వలన వచ్చే పరిణామాలేంటి? అన్న విషయాలు ఆలోచించకుండా ఉన్నత విద్యావంతులు కూడా మెసెజ్ లను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఎంతసేపూ ఫార్వార్డ్ మెసెజ్ లు చేసి చేసీ సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. ఒక విషయంపై తన సొంత అభిప్రాయాలను రాసి దానిపై విమర్శలను కూడా స్వీకరించే స్థాయి ఎంత మందికి ఉంది. ఒక అద్భుతమైన మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ తన ఒక్కడికే పరిమితం అనుకోవడం, తాను చేసిందే కరెక్ట్ అనుకోవడం వంటి అవలక్షణాలను పెంచుకుంటున్నారు.

 

 

ఈ ఫేస్‌బుక్ కూలీలతో ఈ సమాజానికి పైసా ఉపయోగం లేదు!

 

ఫేస్‌బుక్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే లాభసాటి సంస్థ. దాని వ్యవస్థాపకుడు ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు అధిపతి. విచిత్రం ఏమిటంటే ఫేస్‌బుక్ ఇలాంటి అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లను చాలా మందిని తయారు చేసింది. వీళ్లనే ఇప్పుడు ఫేస్‌బుక్ కూలీలు అని కూడా అంటారు. వీళ్లకి ఫేస్‌బుక్ ఒక పైసా కూడా ఇవ్వదు. వీళ్లు మాత్రం కంటెంట్ రాసి ఫేస్‌బుక్ కు ఆదాయం సమకూరుస్తారు. నిరంతరం ఫేస్‌బుక్ లో విహరించే ఈ అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లే వాళ్లకు ఆస్తి. నిజంగా పనిచేసే వాళ్లు , సమస్యపై స్పందించేవాళ్లు ఫేస్‌బుక్ లో ఒక పోస్ట్ పెట్టి వెంటనే రంగంలోకి దిగిపోతారు. అంతేకానీ ఫేస్‌బుక్ లో చర్చకు దిగరు. తమ స్వీయ గుర్తింపు కోసం పాకులాడరు. పెద్ద బిజినెస్ మ్యాన్‌లు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించండి. వాళ్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో పరిమితంగానే ఉంటారు. క్షేత్ర స్థాయిలో తాము చేసిన పనిని మాత్రమే అందులో ప్రస్తావిస్తారు. క్రేజ్ ఉన్న ఒక హీరోను తిడుతూ ఒకడు, పొగుడుతూ మరొకడు తాము పాపులర్ కావాలని తాపత్రయపడుతూ ఉంటారు. తమ సొంత ప్రతిభతో ఆ పాపులారిటీని సంపాదించుకోవాలని ఒక్కరోజూ అనుకోరు. పాపులారిటీ, గుర్తింపు అనేది చేసే పని, నిజాయితీ, కష్టించే మనస్తత్వం వలన వస్తుంది. ఇలా సోషల్ మీడియాలో సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, వాల్ మీద మాత్రమే సామాజిక బాధ్యతను నిర్వర్తించే వాళ్లకు దూరంగా ఉండండి. వీళ్ల వలన దేశానికే కాదు మీకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. బీ కేర్ ఫుల్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్  చేస్తున్నవారు) 

 

 

బాగా కిక్ ఇచ్చే డ్రగ్స్ ఏంటో తెలుసా?

 

 

ఇప్పుడు మ‌న దేశంలో మాద‌క ద్ర‌వ్యాలు అతిపెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించాయి. మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌లుగా మార‌డంతో ఉత్సాహంతో ఉర‌క‌లెత్తాల్సిన యువ‌త, జ‌వ‌స‌త్వాలు ఉడిగి య‌వ్వ‌నంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్వ‌మైపోతున్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా కుటుంబాల‌కు కుటుంబాలే నాశ‌న‌మై ఆ రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాలు ఎన్ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చినా మ‌న దేశంలో ఇప్ప‌టికీ మాద‌క ద్ర‌వ్యాలు సులువుగానే దొరుకుతున్నాయి. ఒకవైపు దేశానికి వెన్నుముక లాంటి యువ‌త మాద‌క‌ద్ర‌వ్యాల సేవ‌నంతో ప‌త‌న‌మ‌వుతుంటే మ‌రోవైపు పాల‌కులు మాత్రం ఇంకా నిషేధం అన్న ద‌గ్గ‌రే నిలిచిపోయారు. అయితే మాదక ద్ర‌వ్యాలపై ఎప్ప‌టి నుంచో నిషేధం ఉన్న‌ప్ప‌టికీ అవి యువ‌త‌కు ఎలా అందుబాటులోకి వ‌స్తున్నాయి? అస‌లు అన్నింటికంటే ముఖ్యంగా కేవ‌లం మాద‌క ద్ర‌వ్యాల‌ను నిషేధిస్తే ఈ పెను స‌మ‌స్య ప‌రిష్కార‌మైపోతుందా? అన్న ప్ర‌శ్న‌లు అతిపెద్ద చ‌ర్చ‌నీయాంశాలు. ఈ నేపథ్యంలో మాద‌క ద్ర‌వ్యాలు, యువ శ‌క్తిపై “కెరీర్ టైమ్స్” ప్ర‌త్యేక విశ్లేష‌ణ‌.

 

 

నిషేధం అన్న ప‌ద‌మే అతిపెద్ద మాద‌క‌ద్ర‌వ్యం!!

 

మ‌నిషి ఆలోచ‌నా విధానం, మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌, వికాసం అన్న‌వి అత్యంత సంక్లిష్ఠ‌మైన విష‌యాలు. మానసిక శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నాల ప్ర‌కారం ఫలానా ప‌నిచేయొద్దు..ఫ‌లానా వ‌స్తువును తినొద్దు…ఫ‌లానాది తాకొద్దు, చూడొద్దు..అంటూ నియంత్ర‌ణ‌లు విధిస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఆ ప‌ని చేయాల‌ని..వ‌ద్దు అన్న‌దాన్నే తినాల‌ని..తాకొద్దు అన్నదాన్నే తాకాల‌ని..చూడొద్దు అన్న దాన్నే చూడాల‌ని మ‌నిషి మ‌న‌స్సు ఉబ‌లాట‌ప‌డుతుంది. ముఖ్యంగా నియంత్ర‌ణ విధించిన ఆ ప‌నులపై అర‌కొర స‌మాచారం, త‌ప్పుడు స‌మాచారం వాటిపై మ‌రింత ఆక‌ర్ష‌ణ పెరిగేలా చేస్తుంది. దీంతో వాటిని ఎలాగైనా తినాల‌ని, వాటిని సాధించి అందులోని మ‌జాను ఆస్వాదించాల‌ని మ‌న‌స్సు ఉవ్విళ్లూరుతుంది. మాద‌క ద్ర‌వ్యాల విష‌యంలో ఇప్పుడు స‌రిగ్గా ఇలానే జ‌రుగుతోంది. వాటికి నిషేధం అన్న ముసుగు వేయడంతో ఆ ముసుగు వెన‌కాల అద్బుత‌మైన ఆనందం దాగి ఉంద‌ని యువ‌త‌ను పెడ‌దారి ప‌ట్టించే అరాచ‌క శ‌క్తులు ఎక్కువైపోయాయి. దీంతో యువ‌త డ్ర‌గ్స్ ఏదో అద్భుతం దాగి ఉంద‌న్న ఆక‌ర్ష‌ణ‌తో జీవితాల‌ను స‌ర్వ నాశ‌నం చేసుకుంటున్నారు.

 

 

మ‌న రోజువారీ జీవితంలోనూ మాద‌క ద్ర‌వ్యాలు ఉన్నాయి!

 

మ‌న రోజూవారీ జీవితంలో మాద‌క ద్ర‌వ్యాలు ఉండ‌ట‌మేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవును మీరు చ‌దివింది నిజ‌మే. అస‌లు మాద‌క ద్ర‌వ్యం అంటే ఏమిటి? ఒక ప్ర‌త్యేక‌మైన రసాయ‌నాన్ని శ‌రీరంలోకి ఎక్కించుకుని అది అందించే మ‌త్తులోకి జారిపోవ‌డ‌మే క‌దా? మాద‌క ద్రవ్యాలు అంటే కొకైన్, హెరాయిన్, గంజాయి వంటివే కాదు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో వాడే కొన్ని ర‌కాల మందులు కూడా మాద‌క ద్ర‌వ్యాలు కింద‌కే వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు షుగ‌ర్ పెషెంట్ల‌కు వాడే కొన్ని ర‌కాల ముందులను డ్ర‌గ్స్ గానే ప‌రిగ‌ణించాలి. అంటే ఆరోగ్యానికి చేటు చేస్తాయ‌ని కాదు. మ‌నిషి ఆ ముందులు వేసుకోవ‌డానికి అల‌వాటు ప‌డి స‌హ‌జ సిద్ధంగా శారీర‌క వ్యాయామం చేసి మంచి స‌మ‌తుల ఆహారం తీసుకుని జీవ‌నశైలిని మార్చుకుని షుగ‌ర్ ను అదుపులోకి తెచ్చుకుందాం అన్న ఆలోచ‌న మ‌ర్చిపోతున్నాడు. కేవ‌లం ఆ డ్ర‌గ్స్ ను శ‌రీరంలో వేసుకుని వాటికి అల‌వాటు ప‌డి అందులోనే జోగుతున్నాడు. అలాగే ప్ర‌స్తుతం మ‌నిషి జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న స్మార్ట్ ఫోన్, సోష‌ల్ మీడియా వంటి వాటిని కూడా మాద‌క ద్ర‌వ్యాలు గానే ప‌రిగ‌ణించాలి. అవి లేకుంటే ఒక్క‌క్ష‌ణం కూడా మ‌నుగ‌డ సాగించలేని మ‌న బ‌ల‌హీత‌నను డ్ర‌గ్స్ సేవ‌నంతో స‌మాన‌మైన వ్య‌స‌నంగానే చూడాల్సి ఉంటుంది.

 

 

నిషేధంతో మాద‌క ద్ర‌వ్యాల క‌ట్ట‌డి సాధ్యం కాదు!

 

నిషేధం విధిస్తేనో లేక నియంత్రిస్తేనో మాదక ద్ర‌వ్యాల స‌మ‌స్య అంతం కాదు. ఎందుకంటే వాటిని దొంగ దారిలో యువ‌త‌కు చేర‌వేసే ఆరాచ‌క శ‌క్తులు లెక్క‌కు మించి ఉన్నాయి. నిషేధం అనేది ఎప్ప‌టికీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌దు. ఇప్పుడు ప్ర‌భుత్వాలు చేయవ‌ల‌సిన ప‌ని నిషేధంతో పాటు స‌మ‌స్య మూలాల్లోకి వెళ్లి దాన్ని తొలిగించే ప్ర‌య‌త్నం చేయ‌డం. పాఠ‌శాల స్థాయి నుంచే పిల్ల‌ల‌కు ధ్యానం, యోగా, కుటుంబ విలువ‌లు, శారీర‌క, మానసిక ఆరోగ్యాల ప్రాధాన్య‌త‌ను వివ‌రిస్తే అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. ధ్యానం చేయడం ద్వారా ల‌భించే అలౌలిక ఆనందం ముందు డ్ర‌గ్స్ అందించే మ‌త్తు బ‌లాదూర్. దీంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్వీయ నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో పిల్ల‌ల‌ను సుక్షితులుగా త‌యారు చేయాలి. ఇటు త‌ల్లిదండ్రులు కూడా డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంగా కాకుండా త‌మ పిల్ల‌ల‌కు త‌గిన స‌మ‌యం కేటాయించి వారి పెంప‌కంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వారి అల‌వాట్లు, ప్ర‌వ‌ర్త‌న పై త‌గు నిఘా ఉంచి అదే స‌మ‌యంలో వారికి ధ్యానం, మ‌న‌స్సుని నియంత్రించే విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెపుతూ ఉండాలి. తాత్కాలిక ఆనందాలు, సుఖాలు త‌ర్వాత జీవితాన్ని ఎంత‌గా ప్ర‌భావితం చేస్తాయో, ఎటువంటి ప‌త‌నావ‌స్థ‌కి చేరుస్తాయో వారికి స‌రైన ప‌ద్ధ‌తిలో వివ‌రించాలి. ముఖ్యంగా విలువ‌ల‌తో కూడిన పెంప‌కాన్ని అందించాలి.

 

 

న‌మ్మ‌కంలోని మజాతో జీవితానికి కొత్త చిగురులు!

 

ఒక రోగి తీవ్ర‌మైన శారీర‌క రుగ్మ‌త‌తో డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. అత‌న్ని క్షుణ్ణంగా ప‌రీక్షించిన డాక్ట‌ర్ ఇంకో మూడు నెల‌లు మించి మీరు బ‌త‌కడం సాధ్యం కాద‌ని రోగికి స్ప‌ష్టం చేసారు. దీంతో ఆ రోగి మాన‌సికంగా మ‌రింత‌గా దిగ‌జారిపోయాడు. అత‌ను ఎంత‌గా దిగ‌జారిపోయాడంటే క‌నీసం డాక్ట‌ర్ చెప్పిన మూడు నెల‌లైనా బ‌తుకుతాడా? అన్న సందేహం అంద‌రికీ క‌లిగింది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆ రోగిని ప‌రామ‌ర్శించేందుకు అత‌ని స్నేహితుడు హాస్పిట‌ల్ కు వెళ్లాడు. వృత్తిరీత్యా సైకాల‌జిస్ట్ అయిన రోగి స్నేహితుడు అత‌ని ప‌రిస్థితిని గ‌మ‌నించాడు. అత‌నికి శారీర‌క స‌మ‌స్య కంటే మానసిక స‌మ‌స్య అధికంగా ఉన్న‌ట్టు గుర్తించాడు. త‌న స్నేహితుడ్ని హాస్ప‌ట‌ల్ నుంచి ప్ర‌కృతికి ప్ర‌శాంత‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఒక ఇంట్లోకి మార్పించాడు. అత‌ని మంచం ప‌క్క‌నే కిటికీ ఉండేట‌ట్టు చూసి అక్క‌డ ఒక మొక్క‌ను నాటాడు. అప్పుడు ఆ రోగితో ఇలా చెప్పాడు. “ఇప్పుడు ఇక్క‌డ ఒక మొక్క‌ను నాటాను. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదిగితే నువ్వు కూడా నీ జ‌బ్బు నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టే. ఒకవేళ మొక్క చ‌నిపోతే నువ్వు కూడా తొంద‌ర‌గా చ‌నిపోతావ్” అని చెప్పాడు. ఆ రోగి ప్ర‌తిరోజూ ఉద‌యం లేవ‌గానే ఆ మొక్క వంక ఆశ‌గా చూసేవాడు. ఆ మొక్క మెల్ల‌గా ఆకులు, పూలు కాస్తూ ఏపుగా పెరుగుతోంది. రోగిలో ఆనందం పెరిగింది. త‌న మొక్క ఎంత బాగా పెరుగుతుంది అన్న ఆనందంలో అత‌ను త‌న జ‌బ్బు సంగ‌తే మ‌ర్చిపోయాడు. ఆరోగ్యంగా పెరిగిన ఆ మొక్క‌లానే అత‌ను కూడా ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. వాస్త‌వానికి మొద‌ట నాటిన మొక్క తొలిరోజే చ‌చ్చిపోయింది. కానీ రోగికి తెలియ‌కుండా అతని ఒక కొత్త మొక్క‌ను నాటి దానికి త‌గిన నీరు, ఎరువులు వేసి అది బాగా ఎదిగేలా చూసుకున్నాడు. మొక్క బాగా పెరుగుతుంద‌న్న సంతోషంలో రోగి కూడా ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. ఈ క‌థ‌లో నీతి ఏంటి మ‌నలోని న‌మ్మ‌కం, ఆనంద‌మే మ‌న స్థితిని నిర్ణ‌యిస్తాయి. అయితే ఆ ఆనందాన్నిఏ విధంగా సంపాదించుకుంటామ‌న్న‌దే ముఖ్యం. మాద‌క ద్ర‌వ్యాలు తీసుకుని, తాత్కాలిక ఆనందాల కోసం వెంప‌ర్లాడితే ఆనందం, ఆరోగ్యం రెండూ దూర‌మ‌వుతాయి.

 

 

మాద‌క ద్ర‌వ్యాల కంటే కిక్ నిచ్చే సాధ‌నాలున్నాయి!!

 

మాద‌క ద్ర‌వ్యాలు, మ‌ద్య‌పానం కిక్ నిస్తున్నాయి కాబ‌ట్టి వాటిని సేవిస్తున్నారు. ఆ కిక్ కోస‌మే ఆరోగ్యం పాడుచేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. కొంద‌రు వాదిస్తారు. కానీ వాస్త‌వానికి వాటి కంటే కిక్ నిచ్చే విష‌యాలు ఎన్నో ఉన్నాయి. ఒక గంట‌సేపు క‌ద‌ల‌కుండా ఒకచోట కూర్చుని , ఒక విష‌యంపై శ్ర‌ద్ధ పెట్టి త‌దేకంగా ధ్యానం చేస్తే వ‌చ్చే కిక్ ఎన్ని మాద‌క ద్ర‌వ్యాలు తీసుకున్నా రాదు. అలాగే ఒక మంచి ప‌ని చేసిన‌ప్పుడు, సాటి మ‌నిషికి ఉపకారం చేసిన‌ప్పుడు, ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పేద‌వాళ్ల‌కు క‌డుపునిండా అన్నం పెట్టిన‌ప్పుడు వ‌చ్చే కిక్ ఎంతో బాగుంటుంది. ఇటువంటి విష‌యాల‌ను ప్ర‌తీ విద్యార్ధికి అటు త‌ల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్న‌త‌నం నుంచి చెప్ప‌గ‌ల‌గాలి. ఇక ప్ర‌భుత్వాలు కూడా మాద‌క ద్ర‌వ్యాల వంటి పెను స‌మ‌స్య‌ల‌కు నిషేధం అన్న ప‌రిష్కారం మార్గం ద‌గ్గ‌ర ద‌గ్గ‌రే ఆగిపోకుండా స‌మ‌స్య మూలాల‌ను అర్ధం చేసుకుని , విలువలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్వీయ‌నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో విద్యార్ధులకు మ‌రింత శిక్ష‌ణ ఇచ్చేందుకు విద్యా విధానంలో త‌గిన మార్పులు చేయాలి. అప్పుడు డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి ఎటువంటి నిషేధం అవ‌స‌రం లేకుండానే మ‌న దేశాన్ని వీడిపోతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)

 

9 టు 5 రోటీన్ జాబ్ మీకు నచ్చదా? అయితే ఈ కెరీర్స్ పై లుక్కేయండి!

 

దయాన్నే హడావుడిగా నిద్ర లేవడం, గబా గబా తయారై ట్రాఫిక్ లో ఆఫీస్ కు చేరుకోవడం అక్కడ ఓ 8 గంటలు పనిచేసి సాయింత్రం ఏడుకి మళ్లీ ఇంటికి చేరడం. ఇలా ప్రతీ రోజూ చేసే రోటీన్ జాబ్స్ ను ఈతరం ఇష్టపడటం లేదు. అధిక శాతం మంది 9 టు 5  జాబ్స్ కాకుండా కాస్త భిన్నంగా ఉంటే జాబ్స్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా తమకు నచ్చినప్పుడు మాత్రమే పనిచేసే వీలున్న జాబ్స్ ను చాలా మంది కోరుకుంటున్నారు. ఈ విధంగా ఆలోచించే వారి కోసం ప్రజంట్ జాబ్ మార్కెట్లో ఎన్నో జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. అనుకున్న సమయానికి టాస్క్ ను పూర్తి చేయగలిగితే చాలు వీరు ఏం టైం లో పనిచేస్తున్నారు? ఎంత సేపు పనిచేస్తున్నారు అని ఎవరూ అడగరు. రోటీన్ కు భిన్నంగా కూల్ గా జాబ్ చేయాలనుకునే వారి కోసం చాలా జాబ్స్ రెడీగా ఉన్నాయి. మన ‘కెరీర్ టైమ్స్’ లో ఇప్పుడు అటువంటి జాబ్స్ కోసం తెలుసుకుందాం.

 

ఫ్రీలాన్స్ వెబ్‌ డిజైనర్ 

 

      ఈ టెక్నాలజీ యుగంలో ప్రతీ పనీ వెబ్ సైట్ ద్వారానో లేక మొబైల్ యాప్ ద్వారానో జరుగుతుంది. సమాచార ప్రదర్శనకు, తమ సంస్థ ప్రధాన ఉద్దేశం చెప్పడానికి ప్రతీ కంపెనీకి ప్రత్యేకమైన వెబ్‌సైట్ ఉండాల్సిందే. దీనికి చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ప్రతీ సంస్థకు ఇప్పుడు సొంత వెబ్‌ సైట్ తప్పనిసరి. కొన్ని కంపెనీలు తమ కంపెనీలు వెబ్‌సైట్ లో తమ ఉత్పత్తుల అమ్మకాలు కూడా జరుపుతున్నాయి. అయితే కంపెనీకి వెబ్‌సైట్ తప్పనిసరి కానీ కేవలం వెబ్‌డిజైనింగ్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగిని నియమించుకోలేవు. అందుకే దాదాపు అన్ని సంస్థలు వెబ్‌డిజైనింగ్ ను ఔట్‌సోర్సింగ్ చేస్తున్నాయి. కాబట్టి పనివేళలతో సంబంధం లేకుండా నచ్చిన సమయంలో పనిచేసుకోవచ్చు. కానీ కంపెనీ నిర్దేశించిన గడువు లోగా వర్క్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వెబ్‌ డిజైనర్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో కంప్యూటర్స్ ఉంటే చాలు నెలకు రెండు మూడు ప్రాజెక్ట్ లు చేసి 25 నుంచి 30 వేల వరకూ సంపాదించే వీలుంది. బాగా పనిచేస్తారని పేరు సంపాదిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. 
 
 
 
 

సోషల్ మీడియా కన్సల్టెంట్ 

 

       ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది.  యువత అంతా తమ అభిప్రాయాలను, భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎక్కువ సమయంలో అందులోనే గడుపుతున్నారు. దీంతో కంపెనీలు తమ ప్రచార వ్యూహాలను మార్చుకున్నాయి. సోషల్ మీడియాను తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. తమ కంపెనీని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే పనిని సోషల్ మీడియా కన్సల్టెంట్స్ కు అప్పగిస్తున్నాయి.  సోషల్ మీడియా కన్సల్టెంట్స్ తాము తీసుకున్న పనిని తమకు వెసులుబాటు ఉన్న సమయంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసినందుకు వీరికి నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకూ అందుతున్నాయి. ఇంగ్లీష్ పై కాస్త పట్టు ఉండి, చేతిలో మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా సోషల్ మీడియా కన్సల్టెంట్ అయిపోవచ్చు. 
 

పర్సనల్ ట్రైనర్ 

 

      ప్రస్తుతం నైపుణ్యం లేని వ్యక్తికి జాబ్ మార్కెట్ లో విలువ లేదు. అడకమిక్ అర్హతలు ఎన్ని ఉన్నా కమ్యూనికేషన్, లీడర్ షిఫ్ వంటి లక్షణాలు లేకపోతే కంపెనీలు జాబ్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా తర్వాత నిర్దాక్షిణ్యంగా తొలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఉద్యోగికి, ఉద్యోగార్ధికి భావవ్యక్తీకరణ, నాయకత్వం లక్షణాలను పెంపోదించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ రెండు విషయాలను నేర్పించే పర్సనల్ ట్రైనర్స్ కు ఆదరణ పెరిగింది. ఉద్యోగికి వెసులుబాటు ఉన్న సమయంలో వీరు అతని దగ్గరికి వెళ్లి ఈ విషయాల్లో అతన్ని ట్రైనప్ చేస్తారు. ముఖ‌్యంగా ఉదయం సాయింత్రం వేళ్లలో మాత్రమే వీరికి పని ఉంటుంది. మంచి భోధనా నైపుణ్యం ఉంటే పర్సనల్ ట్రైనర్స్ నెలకు 25 నుంచి 30 వేలు సంపాదించవచ్చు. 
 
 
 
 

రియల్ ఎస్టేట్ ఏజెంట్ 

 

        ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా మారిపోయింది. భూమికి ఉన్న విలువను గుర్తించి చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి ఎక్కడ , ఎలా, ఎంత అన్న విషయాలపై అవగాహన ఉండదు. ఇటువంటి గైడ్ చేసి వారికి అనుకూలమైన స్థలాన్ని, వారి పెట్టుబడి మెత్తం ఆధారంగా చూపించేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అవసరం ఏర్పడింది. ఈ కెరీర్ లో చేయవలసింది చాలా చిన్న పని. ఇన్వెస్టర్ తో భూమి యజమానితో మాట్లాడి ఇద్దరికి సంధానకర్తగా వ్యవహరించి అనుకున్న సమయానికి భూమికి చూపిస్తే సరిపోతుంది. ఎటువంటి వివాదాలు లేని భూమిని ఇన్వెస్టర్లకు చూపిస్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వెలిగిపోవచ్చు.  ప్రస్తుతం రియల్ ఎస్టేట్  పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కెరీర్ కు ఢోకా ఉండకపోవచ్చు. 
 
 
 
 

ట్యాక్స్ కన్సల్టెంట్ 

     
 

    ప్రస్తుతం ఉద్యోగుల్లో చాలా మందికి పన్నులకు సంబంధించిన విషయాలపై అంతగా అవగాహన ఉండదు. ఎంత ఆదాయం వస్తే ఎంత పన్ను చెల్లించాలి? పన్నుల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పద్ధతులను అనుసరిస్తే పన్ను భారం అనిపించదు? వంటి విషయాలను తెలియజెప్పేందుకు నిపుణుల అవసరం పడింది. అలాంటి అవసరం లోంచి పుట్టుకొచ్చిందే ట్యాక్స్ కన్సల్టెంట్ కెరీర్. ప్రస్తుతం చాలా మంది వ్యక్తులు, సంస్థలు తమ పన్ను సంబంధిత వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయి. సమయం లేకపోవడం వలన వీరు ఆ బాధ్యతలను ట్యాక్స్ కన్సల్టెంట్ కు అప్పగిస్తారు. వీరు ఉద్యోగికి అనుకూలమైన సమయంలో వాళ్లను కలిసి వివరాలు సేకరించి ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? అన్న విషయాలపై ఒక ప్రణాళిక తయారు చేస్తారు. వారికి తగిన గైడెన్స్ ఇస్తారు. ట్యాక్స్ కన్సల్టెంట్ గా పేరు సాధిస్తే నెలకు 30 నుంచి 40 వేల వరకూ ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంది. 

 
 
(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)